జగన్ ఫ్యామిలీ ఢిల్లీ పర్యటన ! కాంగ్రెస్ పార్టీతో మిలాఖత్ లేదు లేదు అంటూనే జగన్ భార్య భారతి, తల్లి విజయమ్మలు మన ఎం.పీలకు తారస పడ్డారట ఢిల్లీలో. అందునా ఆదివారం, ఢిల్లీలోని రామలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలి తలపెట్టిన రోజే వీరి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. వివరాల్లోకి వెళితే ఈ.డి తన తదుపరి దర్య్యప్తులో భాగంగా జగన్ కు చెందిన కీలక వ్యాపారాలు , భవన సముదాయాలను టార్గెట్ చెయ్యవచ్చన్న సమాచారంతో ఉలికిపడ్డ జగన్ కుటుంబ సభ్యులు ఇలా ఢిల్లీకి వెళ్లి సోనియా నమ్మిన బంటు అహ్మద్ పటేల్ , వీరప్ప మోయిలిలను కలిసినట్లు వినికిడి. ఏ అంగీకారం కుదిరిందో కానీ మొత్తానికి ఇలా వీరు కంట పడడంతో మన రాష్ట్ర ఎం.పీ లు మాత్రం రానున్న రాజకీయ పరిణామాలకు ఇలా ఢిల్లీ వేదిక కావడం ఫై మాట్లడుకోవడం కనబడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: