'దేనికైనా రెడీ' చిచ్చు ఇంకా చెలరేగుతూనే వుంది. ఈ కొన్ని రోజులుగా బ్రాహ్మణులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ చిత్రంలో తమను కించ పరిచే విధంగా సన్నివేశాలు చిత్రీకరించారంటూ బ్రాహ్మణ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తూనే వున్నారు. అయితే ముళ్లును ముళ్లుతోనే తీయాలన్నట్టు ఈ విషయంలో మోహన్ బాబు కొత్త ప్లాన్ వేసినట్టే కనిపిస్తోంది. తాజాగా కొందరు బ్రాహ్మణ పెద్దలు, పండితులు మోహన్ బాబుకు అండగా నిలుస్తూ మీడియా ముందుకు వచ్చారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మోహన్ బాబు లాంటి మంచి వ్యక్తులకు పిండం పెట్టడం సరికాదని ఆయనకు అండగా నిలిచారు. మోహన్ బాబు కుటుంబం అన్ని విధాలుగా బాగుండాలని ఆశీర్వదించారు. ఈ విషయంపై ఇప్పటికీ నోరు విప్పని మోహన్ బాబును వివరణ కోరగా.. తాను ఏమీ మాట్లాడదలుచుకోలేదని, న్యాయస్థానంలో కేసు నడుస్తున్నందున అక్కడే అన్నీ విషయాలు తేలుతాయని సమాధానం ఇచ్చారు.  ఓ వైపు కొందరు బ్రాహ్మణులు మోహన్ బాబుకు ఆశీర్వచనాలు ఇస్తుండగా.. అదే సమయంలో మరో వైపు కొందరు బ్రాహ్మణులు హైదరాబాద్ లోని ఖైరతాబాద్ చౌరస్తాలో మోహన్ బాబుకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: