సరికొత్త రాజకీయ ఆరోపణ చేశాడు తెలుగుదేశం ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య. బీసీ ఉద్యమ పోరాట కర్త కూడా అయిన కృష్ణయ్య తాజాగా జాతీయ రాజకీయాలపై ఒక రాజకీయ విమర్శను సంధించాడు. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ పరిస్థితి గురించి ఈ కామెంట్ చేయడం విశేషం. ప్రధానమంత్రి నరేంద్రమోడీని అడ్డుకోవడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని కృష్ణయ్య అన్నాడు.

అంతటితో ఆగక.. మోడీ బీసీ కాబట్టే ఆ శక్తులు ఆయనను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నాయని కూడా వ్యాఖ్యానించాడు. ఇది మాత్రం ఆసక్తికరమైన ఆరోపణే! ప్రధానమంత్రి అత్యంత శక్తి మంతుడు అనుకొంటే.. ఆయనను కులం పేరు తో అడ్డుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కృష్ణయ్య అన్నాడు.

తమలాంటి బీసీ వర్గానికే చెందిన ప్రధానిని అడ్డుకోవడానికి కొన్ని అగ్రవర్ణ శక్తులు ప్రయత్నిస్తున్నాయని అంటూ కృష్ణయ్య సంచలన ఆరోపణే చేశాడు. మరి అగ్రవర్ణ శక్తులు.. బీసీలను అడ్డుకోవడానికి జాతీయ స్థాయిలో ప్రయత్నిస్తున్నాయని కృష్ణయ్య తేల్చేశాడు.

ఇంత వరకూ జాతీయ స్థాయిలో ఇంకా ఎవరూ ఇలాంటి ఆరోపణలు అయితే చేయలేదు. కానీ కృష్ణయ్య ఒక విధంగాసంచలన ఆరోపణ చేశాడు. బహుశా ఆర్ఎస్ఎస్ వంటి శక్తులను ఉద్దేశించి ఈయన ఇలాంటి ఆరోపణ చేసి ఉండాలి. మరి ఈ రాజకీయ ఆరోపణల గురించి భారతీయ జనతా పార్టీ స్పందిస్తుందా? లేక కృష్ణయ్య ఆరోపనల్లో పసలేదంటూ లైట్ తీసుకొంటుందా?!

మరింత సమాచారం తెలుసుకోండి: