ప్రధాని పదవిపై తనకి ఆసక్తి లేదని బీజేపీ అగ్ర నేత ఎల్‌కే అద్వానీ స్పష్టం చేశారు. పార్టీ కంటే ప్రధాని పదవి చాలా చిన్నదని ఢిల్లీలో అద్వానీ వ్యాఖ్యానించారు. పార్టీకి తానింకా చేయాల్సింది చాలా ఉందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఓవైపు ముందస్తు ఎన్నికలంటూ బీజేపీ హడావిడి చేస్తున్న తరుణంలో అద్వానీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: