తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్న మీ కోసం పాదయాత్ర నిర్విగ్నంగా కొనసాగుతోంది. తమకు ఒకప్పుడు ఆయువుపట్టయిన రంగారెడ్డి జిల్లాలోకి బాబు పాదయాత్ర మొదలైన దరిమిలా పార్టీ కార్యకర్తల్లో ఎక్కడ లేని ఉత్సాహం కనబడింది. ఇవ్వాళ దారిన ఒక గ్రామంలో ఆగినప్పుడు అక్కడ ఒక విద్యుత్ అధికారి తో స్పికర్లో గ్రామస్థుడు మాట్లాడం, అటు నుంచి ఎటువంటి సానుకూల స్పందన లేకపోవడంతో బాబు కాంగ్రెస్ పాలన ఫై నిప్పులు చెరిగాడు. పిల్ల కాంగ్రెస్ ను జగన్ ఏర్పాటు చేసింది తన అవినీతి సొమ్మును దాచుకోవడానికేనని బాబు వ్యాక్యానించాడు. తెరాస ఒక్క రోజు కూడా ప్రజా సమస్యలను పట్టించుకున్న పాపానికి పోలేదని, వారు కూడా ఎదో ఒక రోజు కాంగ్రెస్ లో కలవడం ఖాయమని బాబు అన్నాడు. 2009 డిసెంబరు తర్వాత తెలంగాణా ప్రాంతంలో ఇంతటి ఆదరణను బాబు చూడలేదు, సంతోషంతో పొంగిపోయాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: