వారంతా పొట్ట కూటికోసం పనులకు వచ్చిన వారు. పగలంతా కష్టాలు పడి కాస్త సేద తీరాలని నిద్రలో ఉన్న సమయంలో పిచ్చి ముదిరి ఓ ఉన్మాధి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. నిర్ధాక్షన్యంగా 20 నిండు ప్రాణాలు బలి తీసుకున్నాడు. ఈ రోజుల్లో రోజు రోజు కి మనషి మనుగడకు ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఏ క్షణంలో ఏ ఉపద్రవం వచ్చి పడుతుందో తెలియని ఆయోమయ స్థతి. యాధృచ్చికంగా ప్రమాదాలు జరిగితే అదృష్టం బాగాలేదు అందుకే పోయారు అని సరిపెట్టుకుంటాం కాని మన కళ్లముందే క్రూరంగా చంపివేయ బడితే ఆ బాధ వర్ణనాతీతం. అరబ్ కంట్రీలో ఈ దారుణాలు మరీ చోటు చేసుకుంటున్నాయి.ఉన్మాదులు మరీ రెచ్చిపోతున్నారు.


అమాయకులను విచక్షణా రహితంగా చంపుతున్న ముష్కరులు


తాజాగా పాకిస్థాన్‌ బెలూచిస్థాన్‌ టుర్బట్ నగర శివారులోని స్థానికంగా బ్రిడ్జి నిర్మాణం కోసం వచ్చిన కొంతమంది కార్మికులు ఉంటున్నారు పొట్ట కూటి కోసం వారి కుటుంబాలను పోషించుకోవడం కోసం   శ్రామికులు పగలంతా పని చేసి రాత్రి మాంచి గాఢ నిద్రలో ఉన్నారు.  అయితే ఈ కార్మికులపై ఓ ఆగంతకుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 20 మంది కార్మికులు మరణించారని పోలీసు ఉన్నతాధికారి ఈ రోజు వెల్లడించారు. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారని వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పారు. కార్మికుల శరీరాల్లోకి బులెట్లు దూసుకుపోవడంవల్ల మృత దేహాలు గుర్తు పట్టలేకుండా ఉన్నాయని, ఇది తీవ్రవాదుల చర్యగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు మేమే బాధ్యులమని ఏ తీవ్రవాద సంస్థ ఇంతవరకు ప్రకటించలేదని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: