భారత దేశంలో యోగా గురువు రాందేవ్ బాబా తెలియని వారు ఉండరు. యోగా ద్వారా ఎన్నో వేల మందికి ఈయన చికిత్స చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయుర్వేదం పై మంచి పట్టున్న రాందేవ్ బాబా రాజకీయాల్లో ఎప్పుడూ చురుకుగా పాల్గొంటారు. ఆ మద్య అన్నా హజారే చేపట్టిన లోక్ పాల్ బిల్లుకు మద్దతు పలికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముచ్చెమటలు పట్టించాడు.


యోగ శిక్షణ ఇస్తున్న రాందేవ్ బాబా


ఈయన  హర్యానా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న  రాందేవ్ బాబాకు కేబినెట్ హోదా కల్పించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ నేడు ట్విట్టర్ లో ప్రకటించారు. రాందేవ్ బాబా పర్యవేక్షణలో రాష్ట్రంలో యోగా విద్యను అభివృద్ధి చేస్తామని ప్రకటించిన అనిల్ విజ్, సర్కారీ స్కూళ్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో యోగ శాలలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పాఠ్యాంశాల్లోనూ యోగా విద్యను చేరుస్తామని ఆయన తెలియజేశారు. ఇదిలా ఉంటే, మతపరమైన సంస్థలతో సంబంధాలున్న వ్యక్తులకు ప్రభుత్వ పదవులు కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ, అనిల్ విజ్ ప్రకటనపై నిరసన వ్యక్తం చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: