నందమూరి నటసింహానికి కోపం వచ్చింది.. అంతేనా తనను ఇబ్బంది పెట్టిన పోలీసులను చెడా పడా తిట్టేశారు.  మహానాడు ప్రాంగణంలో హిందుపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ తడాఖా చూపించారు. మహానాడుకు వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు బాలయ్యను కారు వీఐపీలకు కేటాయించిన ప్రాంతంలోనే పార్క్ చేయాలని పోలీసులు   ఆపారు. అయితే పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా బాలకృష్ణ...మహానాడు వేదిక మెయిన్ గేట్ వరకూ కారులోనే వెళ్లారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు తో ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆర్థిక శాఖామంత్రి యమనల రామకృష్ణ  


తను ఎవరో తెలుసా అంటూ ఫైర్ అయ్యాడు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు,ఈ సందర్భంగా పోలీసులను ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించినట్లు తెలుస్తోంది,  అక్కడ ఓ పోలీసు అధికారిని గద్దించినట్లుగా కూడా తెలుస్తోంది.తర్వాత బాలయ్య మాట్లాడుతూ.. అభిమానులు, కార్యకర్తల సంఖ్య అధికంగా ఉండడం, తనకు రక్షణగా ఎక్కువ మంది లేకపోవడంతోనే కారును మెయిన్ గేటు వరకూ తీసుకెళ్తున్నట్టు పోలీసులకు చెప్పానే తప్ప ఎవరినీ తిట్టలేదని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: