గురువారం చాందెల్ జిల్లాలో భద్రతాదళాల కాన్వాయ్ని లక్ష్యంగా చేసుకుని మలిటెంట్లు దాడులకు తెగబడ్డారు, ఈ ఘటనలో ఇరవై మంది సైనికులు మృతి చెందారు , మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి.మోతుల్ నుంచి ఇంపాల్ వెళుతున్న 6 డోగ్రా ఆర్మీ కాన్వాయ్పై గుర్తు తెలియని వ్యక్తులు అకస్మాత్తుగా దాడికి తెగబడ్డారు. ఈ సంఘటన గురువారం ఉదయం మణిపూర్ పరిధిలోని చాండేల్ జిల్లాలో జరిగింది.
సంఘటన స్థలం వద్ద ఆర్మీ సెక్యూర్టీ
ఇటీవలి కాలంలో మణిపూర్లో చోటుచేసుకున్న అతిపెద్ద మిలిటెంట్ల దుశ్చర్య ఇదే. మృతి చెందిన వారిలో 1 జూనియర్ కమిషనర్ ఆఫీసర్, 7 ఓఆర్లు, 1 ఎస్ఐజీ కానిస్టేబుల్, 1 ఏఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది.