టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అంటే చాలు టీడీపీ చిన బాబు లోకేశ్ ఒంటికాలిపై లేస్తుంటాడు. కేసీఆర్ ను విమర్సించే ఛాన్స్ ఏమాత్రం వచ్చినా వదులుకోడు.. ఇప్పుడు నెల రోజుల నుంచి ఎదురుచూస్తున్న రేవంత్ బెయిల్ వచ్చేసింది. ఇక ఆగుతాడా.. అందుకే మరోసారి రెచ్చిపోయాడు. చంద్రబాబుకు ఎదురుపడే ధైర్యం లేక కేసీఆర్ జ్వరం వంకతో డుమ్మా కొట్టాడని విమర్శించాడు. 

కేసీఆర్ ది అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు పట్టుకునే తత్వమని లోకేశ్ మండిపడ్డారు. రాష్ట్రపతికి గవర్నర్ ఇచ్చే విందు కార్యక్రమంలో ఆనవాయితీ ప్రకారం చంద్రబాబు, కేసీఆర్ పాల్గొనాల్సి ఉంది. ఓటుకు నోటు వ్యవహారం బయటికొచ్చాక.. చంద్రబాబు, కేసీఆర్ మొదటిసారి కలుస్తారని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. ఆ ఉద్విగ్న ఘడియలు చూడాలని అనుకున్నారు. 

జ్వరంపై కూడా విమర్శలా..? 


కానీ సోమవారం సాయంత్రం నుంచే కేసీఆర్ జ్వరంతో బాధపడుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి అన్ని అపాయిట్ మెంట్లు క్యాన్సిల్ చేసుకున్నారు. అందుకే ఈ కార్యక్రమానికి కేసీఆర్ హాజరు కాలేకపోయారు. కేసీఆర్ జ్వరంపై కూడా లోకేశ్ విమర్శలు చేశాడు. నిన్నటి వరకూ ఫామ్ హౌజ్ లో మకాం పెట్టిన వ్యక్తికి ఉన్నట్టుండి జ్వరం ఎలా వచ్చిందని ప్రశ్నించాడు. చంద్రబాబుకు ఎదురుపడలేకే జ్వరం పేరుతో తప్పించుకున్నారని కామెంట్ చేశాడు.  

తెలంగాణ ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ భయంపట్టుకుందని.. లోకేశ్ కామెంట్ చేశాడు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు నోటీసు ఇస్తే నెత్తిన పాలు పోసినట్టే అని అన్నాడు. అంతేకాదు.. తెలంగాణ సర్కారు నోటీసుల  కోసం ఎదురు చూస్తున్నామన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: