తెలంగాణలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు వార్తల్లో ఉండే వ్యకి సీనియర్ కాంగ్రెస్ నాయకులు వీహెచ్ హనుమంత రావు. తాజాగా కేసీఆర్ హైటెక్ హంగులతో హై సెక్యూరిటీ ఉన్న బస్సు కొనుగోలుపై విమర్శలు గుప్పించారు.  తెలంగాణలో కేసీఆర్ కి ప్రత్యేక గౌరం ఉందని ఆయకు ఎవరూ శత్రువులు లేరని అయినా కూడా అంత హై సెక్యూరిటీ బస్సు ఎందుకు అని ప్రశ్నించారు.

కేసీఆర్ ప్రభుత్వం కొనుగోలు చేసిన  బస్సు ఇదే...


జిల్లాల్లో పర్యటన కోసం 'తెలంగాణ హరిత పథం' పేరుతో రూ.5 కోట్లతో బస్సును కొనుగోలు చేయటాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తప్పుబట్టారు. ఐదు కోట్ల వ్యయంతో ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారని దుయ్య బట్టారు. దాని బదులు అదే రూ.5 కోట్లను పేదల కోసం ఖర్చు చేయొచ్చు కదా? అని ఆయన ప్రశ్నించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: