విశాఖ పట్నంలో దారుణం జరిగింది. తుపాకీ శుభ్రం చేస్తుండగా మిస్‌ఫైర్ కావడంతో కానిస్టేబుల్ మృతి చెందాడు.  గురువారం ఉదయం జరిగిన ఈ సంఘటనపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.  విశాఖపట్నంలోని జీకే వీధి పోలీస్ స్టేషన్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. విధులు నిర్వహిస్తున్న ఓ సీఆర్పీఫ్‌ జవాన్‌ పేరు అజయ్ కుమార్ యధావిధి గా తన డ్యూటికి వచ్చి  తన తుపాకీ శుభ్రం చేస్తున్న సమయంలో అనుకోకుండా మిస్‌ఫైర్ కావడంతో తీవ్ర గాయం అయ్యింది.

వెంటనే అతన్ని చింతపల్లి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జవాన్‌ మరణించాడు.   ఈ సంఘటనపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అజయ్ కుమార్ సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అతడి సహచరులు అనుమానిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: