భారత దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకు వస్తున్నా.. కామాంధులకు ఇదేమీ పట్టనట్టుగానే తమ పని తాము చేస్తూ పోతున్నారు. ఆడది కనిపిస్తే చాలు చిత్త కార్తె కుక్కల్లే రెచ్చిపోతున్నారు. నిర్భయ చట్టాలు ఎన్ని తెచ్చిన మహిళలపై దాడులు ఆగడం లేదు. ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. వివాహితులనే టార్గెట్ చేస్తున్నారు. తాజాగా నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఓ వివాహితపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.

సోమవారం తెల్లవారుజామున 3గంటలకు కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైలులో హైదరాబాద్‌ నుంచి దంపతులు ఇద్దరు నిజామాబాద్‌కు వచ్చారు.  అర్థరాత్రి కావడంతో స్టేషన్‌లో బస చేశారు. టాయిలెట్‌కు బయటకు వెళ్లిన వివాహితపై అప్పటికే అక్కడ మాటు వేసిన ఉన్న ముగ్గురు దుండగులు అత్యాచారం చేశారు. అక్కడ జరుగుతున్న సంఘఘటన చూసి భర్త ఎదిరించాలని ప్రయత్నించాడు..కానీ అతన్ని చితక బాది భర్త ఎదుటే ఆమెపై అత్యాచారం చేసినట్లు తెలుస్తుంది. తరువాత ఆమె మెడలోని బంగారు నగలను దోచుకెళ్ళారు.

దంపతులు పోలీసులను ఆశ్రయించారు. ఆమెను వెంటనే వైద్యపరీక్షల కోసం ఆసుపత్రిలో చేర్చించారు. నిందితులలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారిస్తున్నారు. మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భర్తల ముందే అఘాత్యానికి పాల్పడుతున్న పోకిరీలను కఠినంగా శిక్షించాలంటున్నారు బాధితురాలి బంధువులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: