సూపర్ స్టార్ మహేష్ సినిమా అంటే కచ్చితంగా రికార్డుల సంచలనాలు సృష్టించాల్సిందే. కమర్షియల్ సినిమాల్లో సామాజిక స్ప్రుహ ఉన్న కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు మహేష్. శ్రీమంతుడు నుండు సరిలేరు నీకెవ్వరు సినిమా వరకు గమనిస్తే మహేష్ సినిమాలు వాటి ఫలితాలు అందరికి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు తర్వాత వంశీ పైడిపల్లితో నేడో రేపో ముహుర్తం పెట్టేయడమే అనుకోగా లేటెస్ట్ గా వంశీ సినిమా గురించి మహేష్ వెనక్కి తగ్గినట్టు చెబుతున్నారు. 

 

అదేంటి వంశీతో మహేష్ మహర్షి సినిమా చేశాడు కదా మరి ఎందుకు అతన్ని పక్కన పెట్టడం అంటే.. సరిలేరు నీకెవ్వారు తర్వాత మహేష్ వంశీతో చేయాలని అనుకున్నా పరశురాం చెప్పిన కథ బాగా నచ్చిందట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో మహేష్, పరశురాం సినిమా లైన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మహేష్ సినిమా అంటే 6 నెలలు నుండి ఏడాది దాకా ఆగాల్సిందే. మహర్షి కోసమే రెండేళ్లు వెయిట్ చేసిన వంశీ మళ్లీ ఏడాది పాటు ఆగుతాడా అన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మారింది.

 

మహేష్ నిజంగానే పరశురాం తో సినిమా కమిట్ అయితే వంశీ వేరే హీరోతో సినిమా ప్లాన్ చేసుకోవడం మంచిది. వంశీ పైడిపల్లితో కథ కొద్దిగా డ్రా బ్యాక్ ఉండటంతో మహేష్ సడెన్ గా పరశురాం సినిమా మీద దృష్టి పెట్టాడు. మరి ఇంతకీ మహేష్ నెక్స్ట్ వంశీతో డేర్ చేస్తాడా లేక పరశురాం కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అన్నది తెలియాల్సి ఉంది. మహేష్ సినిమా గురించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఫ్యాన్స్ ఎదురుచూడాల్సిందే.త్వరలోనే మహేష్ నెక్స్ట్ సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ వస్తుందని తెలుస్తుంది. కె.జి.ఎఫ్ డైరక్టర్ ను కూడా మహేష్ లైన్ లో పెట్టాడన్న వార్తలు తెలిసిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: