రెండేళ్ల నిరీక్షణకు పుణ్యం దక్కేసింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అరసవల్లి సూర్య నారాయణ స్వామిని సూర్య కిరణాలు ఆనందంగా పలకరించాయి. ఈ అద్భుత ఘట్టం కోసం రెండేళ్లుగా భక్తులు ఎదురు చూస్తున్నారు. గత రెండేళ్లుగా స్వామి వారిని సూర్య కిరణాల తాకిడి ఆనవాళ్లు కూడా  కనిపించకుండ నిరాశ చెందిన భక్తులకు ఇవాల్టి ఘటన మనసును ఉత్తేజ,ఉద్రేక,ఉత్సాహ పరిచింది. సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి దక్షిణాయనం నుంచీ ఉత్తరాయణానికి మారే సమయంలో ఇలాంటి ఘటన ఆవిష్కృతమవుతుంది.

ఇలాంటిది ఏడాదిలో రెండు నెలల్లో రెండు సార్లు మాత్రమే ఈ అద్బుతం జరుగుతుంది. ఉదయించే లేలేత సూర్య కిరణాలు స్వర్ణ కాంతులతో శోభయమానంగా ఆలయంలోని గర్భగుడిలో కొలువుదీరిన స్వామి వారి మూల విరాట్ పాదాల నుంచి శిరస్సు వరకు కిరణాలు తాకి కలిగే ఆ ఉత్సహ స్థితికి సాహో అనక తప్పని విధంగా ఆ కిరణాలు స్వామి వారిని తాకాయి.

అయితే వాతావరణం అనుకూలించక మొదటి రోజున కారుమబ్బులు సూర్య కిరణాల తాకిడికి ఆటంకం కలిగినా రెండో రోజు మాత్రం ఏకంగా ఏడు నిమిషాల పాటు సూర్య కిరణాలు స్వామి వారి మూల విరాట్ ను తాకాయి. ఉదయం ఆరు గంటల ఒక నిమిషం నుంచి ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు సూర్య కిరణాలను చూసిన భక్తులు పరవశించిపోయారు.

ఎప్పుడో ఓసారి జరిగే ఈ మహాద్భుతాన్ని చూసేందుకు వచ్చిన భక్తులు మొదటి రోజును నిరాశతో వెళ్ళిపోయినా, రెండో రోజు మాత్రం ఈ సూర్య కిరణాలను కనులారా చూసి పరవశించిపోయారు. శ్రీకాకుళం జిల్లాలో కొలువుదీరిన శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్న భక్తులకు ఈ అదృష్టం దక్కింది అంటు అక్కడి ప్రజలు సంతోష సాగరం లో మునిగి తేలియాడారు. ప్రతి ఏటా మార్చి ఎనిమిది, తొమ్మిది తేదీల్లో సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి, అక్టోబర్ ఒకటి, రెండు తేదీల్లో దక్షిణాయనం నుంచీ ఉత్తరాయణానికి మారుతుంటాడు. ఈ సమయంలో సూర్య కిరణాలు స్వామి వారి మూలవిరాట్ ను తాకుతాయి.అప్పుడు కనపడే ఆ దృశ్య కావ్యాన్ని చూసేందుకు ఎంతో అదృష్టం ఉండాలి అంటూ వేద పండితులు వివరించారు.అలాంటి భాగ్యాన్ని మీరు పొందాలని ఆశిద్దాం.



    మరింత సమాచారం తెలుసుకోండి: