టాప్ 3..
శివనాడార్, ప్రేమ్ జీ, ముఖేష్ ఎడెల్గివ్ ఫౌండేషన్, హ్యూరన్ ఇండియా ప్రకారం శివనాడార్, ఆయన ఫ్యామిలీ రూ.826 కోట్లు విరాళంగా ఇచ్చింది. అజీమ్ ప్రేమ్ జీ రూ.453 కోట్లతో రెండో స్థానంలో, ముఖేష్ అంబానీ రూ.402 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు. దేశంలోని సంపన్నుల్లో అగ్రస్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ దాతృత్వ జాబితాలో మూడో స్థానంలో నిలిచారు.
టాప్ 100లో టాప్ 10 వాటా 63 శాతం....
వ్యక్తిగతంగా, కార్పోరేట్ సామాజిక బాధ్యత (CSR) కింద ఏడాదిలో రూ.5 కోట్లకు మించి విరాళంగా ఇచ్చిన వందమంది జాబితాను రూపొందించారు. జాబితాలోని 100 మంది మొత్తంగా ఇచ్చిన విరాళం రూ.4,391 కోట్లు. ఇందులో మొదటి పదిమంది వాటా 63 శాతంగా ఉండటం గమనార్హం.
విద్య కోసం ఎక్కువగా విరాళం విరాళం...
ఇచ్చిన వారిలో కూడా విద్య కోసం ఎక్కువగా ఇచ్చారు. ఆ తర్వాత ఆరోగ్య సంరక్షణ కోసం ఇచ్చారు. విద్య కోసం 59 మంది, ఆరోగ్య సంరక్షణ కోసం 53 మంది, కళలు, సంస్కృతి, వారసత్వం కోసం 18 మంది విరాళం ఇచ్చారు. మతపరమైన విరాళాలు కాకుండా సామాజిక శ్రేయస్సు కోసం రూ.10 కోట్ల కంటే ఎక్కువ విరాళం ఇచ్చిన భారతీయుల సంఖ్య 2018లో 38 ఉండగా, 2019లో 72కు చేరుకుంది.