రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ చేపట్టిన సాంకేతిక ప్రయోగాలు సత్ఫలితాలనిస్తున్నాయి. కీలక కేసుల్లో పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సామాజిక మాధ్యమాలను వినియోగించుకోవడం ద్వారా నేరస్తుల ఆట కట్టిస్తున్నారు. గత మూడు నెలల వ్యవధిలో 258 కేసుల్లో సోషల్ మీడియా ద్వారా నిందితులను అరెస్టు చేశారు. పదేళ్లుగా పరారీలో ఉన్న వారిని కూడా సోషల్ మీడియా సాయంతో గుర్తించి అరెస్టు చేయడం గమనార్హం. కృష్ణా, విజయనగరం, విశాఖ, చిత్తూరు, అనంతపురం తదితర చోట్ల పలు కేసుల్లో సామాజిక మాధ్యమాల సాయంతోనే క్లూస్ సేకరించగలిగారు.
కేసుల దర్యాప్తుల్లో పోలీసులు తీసుకుంటున్న చర్యలు సామాజిక మాద్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతుండటంతో మారుమూల ప్రాంతాలకు కూడా సమాచారం చేరుతోంది. నిందితుల ఉహాచిత్రాలు, పాత నేరస్తుల ఫొటోలను ఆప్లోడ్ చేస్తున్నారు. పలు కేసుల్లో తప్పించుకుని తిరుగుతున్న వారి పేరుతో ఏమైనా ఫేస్బుక్ ఖాతాలున్నాయా? ఫ్రొఫైల్లో చిరునామా, ఫోన్ నెంబర్లు, వాట్సాప్ వివరాలు తదితర కోణాల్లో కూపీ లాగి సోషల్ మీడియాలో జల్లెడ పడుతుండటంతో అన్వేషణ ఫలిస్తోంది.
జటిలమైన కేసుల్లోను సామాజిక మాధ్యమాలు దారి చూపుతున్నాయని సీనీయర్ ఐపీఎస్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తుండటం విశేషం. సామాజిక మాధ్యమాలపై నిఘా, సమాచారాన్ని క్రో‘కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాం. డ్రగ్స్ మాఫియా, సెక్స్ రాకెట్, ఆన్లైన్ జూదం తదితరాల్లో సోషల్ మీడియా ద్వారా అందుతున్న సమాచారం నేరస్తుల ఆట కట్టించేందుకు దోహదపడుతోంది.
సోషల్ మీడియాను వినియోగించుకుని కేసులు చేధించేలా డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు’డీకరించేందుకు పలు కేసుల్లో పోలీసులు ప్రత్యేక వ్యవస్థను వినియోగించుకుంటున్నారు. తిరుపతి, కర్నూలు, విశాఖ, విజయవాడ, రాజమహేంద్రవరంలోని సైబర్ ల్యాబ్స్ సహకారంతో కేసులను చేధిస్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్ట్రాగామ్, టిక్టాక్, గూగుల్ లాంటి సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుంటున్నారు.