ఈ రైలెక్కిన వారంతా తాము ప్రయాణిస్తున్న ట్రైన్ ఆలస్యమైతే బాగుండనుకోవటం ఖచ్చింతం. దీనికి కారణం లేకపోలేదు.ఈ రైలు గమ్యస్థానానికి చేరాల్సిన సమయానికి చేరకుండా.. ఆలస్యమైతే నష్టపరిహారాన్ని ఇస్తుంది మరి. ఈ తరహా ప్రయోగాన్ని తొలిసారి భారత రైల్వేలో ప్రవేశ పెడుతున్నారు. సరి కొత్త సేవలు అందించే ఈ ట్రైన్ ఢిల్లీ- లక్నో మధ్య పరుగులు తీయనుంది.
అక్టోబరు నాలుగున తేజస్ ఎక్స్ ప్రెస్ లో కొత్త తరహా సౌకర్యాల్ని ప్రవేశ పెడుతున్నారు. దీనికి తగ్గట్లే టికెట్ ధర కూడా కాస్త ఎక్కువే ఉంది. ఢిల్లీ నుంచి లక్నోలో ఈ ట్రైన్ లో ఏసీ ఛైర్ కార్ లో ప్రయాణించాలంటే రూ.1280 ఛార్జ్ చేస్తారు అని తెలుపుతుంది. అదే ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ అయితే రూ. 2450గా ఉండనుంది. అదే సమయంలో లక్నో నుంచి ఢిల్లీకి వచ్చే ఇదే ట్రైన్ ఛార్జీలు కాస్త తక్కువగా ఉండటం గమనించవచ్చు.
కాకుంటే.. ఈ ట్రైన్ టికెట్ల ధరలు డైనమిక్ గా ఉంటాయి. డిమాండ్ కు తగ్గట్లు ధరలు పెరిగిపోతూ ఉంటాయి. విన్నంతనే ప్రయాణం చేయాలనిపిస్తున్న ఈ ట్రైన్ ప్రయోగం ఫలిస్తే.. దేశ వ్యాప్తంగా మరిన్న రైళ్లలో ఈ సౌకర్యాల్ని ఏర్పాటు చేయనున్నారు.సౌకర్యాలు దగ్గట్టు ధర కూడా ఉంది కదా...