మీకు నేరాలు చేయడంలో కొత్త కొత్త టెక్నిక్ లు కావాలా అయితే జైలు కి వెళ్ళండి ఫ్రీగా నేర్చుకోవచ్చు....... ఈ మాట సాక్షాత్తు పోలీస్ అకాడమీ డైరెక్టర్ బీకే సింగ్ అన్నారు. జైలుకు వచ్చే నేరస్థులు తోటి ఖైదీలను చూసి నేరాలు చేయడంలో కొత్త టెక్నిక్‌లు నేర్చుకొంటున్నారు. తెలంగాణ పోలీస్ అకాడమీ వల్ల ప్రభుత్వ ధనం వృధా అవడం తప్పాఎలాంటి లాభం లేదని అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  నేషనల్ పోలీస్ అకాడమీ పరిస్థితి కూడా ఇంతే అన్న ఆయన... పోలీసుల ప్రవర్తన సక్రమంగా లేదన్నారు.

ట్రైనింగ్ సెంటర్‌లలో శిక్షణ తీసుకుని బయటకు వెళ్తున్న అధికారులు మంచి పేరు తీసుకొని రాలేకపోతున్నారని వీకే సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పోలీసు అకాడమీలో ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పోలీసులు ప్రజల కోసం ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ కూూడా ఎక్కడా ప్రజల నుంచి తగిన గుర్తింపు లేదన్నారు. దానికి కారణం శిక్షణా లోపమని వీకే సింగ్ తెలిపారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలన్నారు. బ్రిటిష్ పాలకుల నుంచి వచ్చిన ఆచారం ఇంకా పోలీస్ శాఖలో కొనసాగుతుందని.....డబ్బు ఉన్నవారికి మాత్రమే పోలీసులు పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.


జైళ్లలో మగ్గుతున్న వారిలో 90 శాతం పేదలే ఉన్నారన్న వీకే సింగ్.. కొంతమందికైతే కనీసం తాము ఎందుకు అరెస్టయ్యామో, ఏ కేసులో జైలుకొచ్చామో కూడా తెలీదన్నారు. 
జైలుకు వచ్చే నేరస్థులు తోటి ఖైదీలను చూసి నేరాలు చేయడంలో కొత్త టెక్నిక్‌లు నేర్చుకొంటున్నారు. పోలీసులు మాత్రం వాస్తవానికి అనుగుణంగా ఉండలేక పోవడం దురదృష్టకరమన్నారు.
అవినీతిలో తెలంగాణ రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉందన్న ఓ సర్వే తనను తీవ్రంగా బాధిస్తుంది అన్నారు.ఇటువంటి వ్యవస్థను మార్చలేను కానీ, శిక్షణలో మార్పులు తీసుకొస్తానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.



వీకే సింగ్ కొంత కాలం క్రితం వరకు ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ డీజీగా పని చేశారు. ఇటీవలే పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగం నష్టాల్లో ఉందని.. దీన్ని మూసేయాలని ప్రభుత్వానికి లేఖ రాయాలనిప్రిటింగ్‌ అండ్‌ స్టేషనరీ డీజీగా ఉన్న సమయంలోనూ వీకే సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: