తొలిచూపులోనే ప్రేమ పుడుతుంది అంటారు.. అలా ఒక్కటయినా చాలా  మంది  ప్రేమ జంటలను మనం చూసాం,విన్నాం కూడా. కానీ పెళ్లి  అనేది జీవితంలో ఒక్కసారే జరిగే ఓ అపూర్వమయిన వేడుక కాబ్బటి ,పెళ్ళికి  మాత్రం కొంత సమయం తీసుకొని,అలోచించి మరి ఒక్కటవుతారు .అయితే ఇందుకు బిన్నంగా  ఈ జంట మాత్రం అసలు  టైమ్ ఇవ్వలేదు.

తొలిచూపులోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు,అలా కలిసిన 4 గంటల్లోనే  ఏకంగా  పెళ్లి చేసేసుకున్నారు . ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో చోటుచేసుకుంది. దసరా వేడుకలులో అమ్మవారి సాక్షిగా  ఇరువురు ఒక్కటై  అందరిని ఆశ్చర్చపరిచారు.  సహజంగా పెళ్లంటే అటు ఇరు కుటుంబ సభ్యుల అంగీకారం, మంచి ముహూర్తాలు, జాతకాలు కుదిరాయా లేదా  ఇంకా ఎన్నో  విషయాలు చూసుకోని, చర్చించుకొని  మరి చేసుకుంటారు.

వీటితో అసలు  పనిలేకుండా వారి  ఇరువురి మనసులు  కలిసాయి, మా మనసులు ఎప్పుడో ముడిపడిపోయాయి ఇక పెళ్లి చేసుకోడానికి పెద్ద సమయం దేనికి అని ఇక టైం  వేస్ట్ చేసుకో దలుచుకోలేదు అని, అమ్మవారి సన్నిధి లోనే ఒక్కటయ్యారు ఈ ప్రేమ జంట. ఇంతకీ చూసుకున్న నాలుగు గంటల్లోనే వీరి మధ్య ప్రేమ ఎలా కలిగింది అని  అనుమానం వ్యక్తం చేస్తున్నారు? అసలు విషయం ఏమిటంటే  వీరిద్దరూ ఫేస్‌బుక్ ద్వారా ఫ్రెండ్స్ అయ్యారు.

ఫేస్‌బుక్ ద్వారా  మొదట స్నేహితులుగా మారిన సుదీప్ ఘోషల్, ప్రతిమా బెనర్జీలు ఒకరినొకరు ఇష్టపడ్డారు. వారిద్దరూ చాటింగ్ ద్వారానే పరస్పరం మాట్లాడుకొనేవారు.  ఎప్పుడు ఒకరికొకరు  కలుసుకోలేదు.అయితే  కోల్‌కతాలో దుర్గాపూజ వేడుకల్లో అనుకోకుండా  అకస్మాత్తుగా ఒకరికి ఒకరు ఎదురుపడ్డారు. దీంతో ఆ అమ్మవారే వారిని కలిపిందనే నమ్మకంతో  వెంటనే అమ్మవారి సన్నిధి లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు.ప్రేమ ఎప్పుడు ఎవరి మధ్య ఎలా చిగురించి,వివాహ బంధం కింద దారితీస్తుందో ఎవరు ఊహించలేరు కదా..


మరింత సమాచారం తెలుసుకోండి: