ఇటీవల అక్కడి నుంచీ కొంత మంది టెర్రరిస్టులు... నిండా బాంబుల సంచులతో జమ్మూకాశ్మీర్ వైపు బయల్దేరారు. నిఘావర్గాలు వాళ్లను కనిపెడుతూ ఉన్నా... వాళ్లు రకరకాల మార్గాల ద్వారా వచ్చేందుకు యత్నిస్తున్నారు. వాళ్లంతా జమ్మూకాశ్మీర్లో ఆత్మాహుతి దాడులు చేసేందుకే వస్తున్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్ట్.నిజానికి ఫిబ్రవరిలో బాలకోట్లో దాడులు చేసిన తర్వాత... దాదాపు 6 నెలల పాటూ ఆ ప్రాంతం సైలెంట్గా ఉంది. ఆ తర్వాత ఎక్కడి నుంచీ వచ్చారోగానీ... అక్కడే తిష్టవేశారు. రెండు నెలలుగా హార్డ్ కోర్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు.
ఇక్కడ మనం ఓ విషయం గుర్తుంచుకోవాలి. ఉగ్రవాదులంటే ఇదివరకట్లా కాదు... ఇప్పుడు తయారవుతున్నవాళ్లంతా టాలా స్టైలిష్గా, మోడ్రన్ లుక్లో ఉంటున్నారు. అందువల్ల వాళ్లు మన మధ్యకు వచ్చినా... ఏమాత్రం గుర్తు పట్టలేం. వాళ్లు సంపాదించుకుంటున్న వెపన్స్ కూడా మోడ్రన్ టెక్నాలజీతో పనిచేసేవే. సో, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రద్దీ ప్రదేశాల్లోకి వెళ్లకుండా అలర్ట్ అవ్వాలి.