కేసీఆర్.. సంప్రదాయాలు, పూజలకు పెద్ద పీట వేసే వ్యక్తి.. అందులోనూ ఇది దసరా పండుగ.. తెలంగాణవాసులకు పెద్ద పండుగ. అందుకే సీఎం కేసీఆర్ ఈ పండుగను సందడిగా జరుపుకున్నారు. విజయ దశమి పర్వదినం పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన అధికారిక నివాసంలో పండుగ చేసుకున్నారు.


సీఎం కేసీఆర్ దసరా సందర్భంగా వాహన పూజ, ఆయుధ పూజ ఘనంగా నిర్వహించారు. దసరా పండుగ నాడు మంగళవారం ఉదయం ప్రగతి భవన్ నివాసంలోని నల్ల పోచమ్మ దేవాలయంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. వాహన పూజ చేసారు.


నివాసంలో ఆయుధ పూజ అనంతరం పాలపిట్ట దర్శనం చేసుకున్నారు. ఉద్యోగులకు, కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో కేసీఆర్ కుటుంబం అంతా పాల్గొంది.


ఈ పండుగ సంబరాల్లో.. కేసీఆర్ తో పాటు ఆయన సతీమణి శోభాచంద్రశేఖర్ రావు, కుమారుడు కె.తారక రామారావు, కోడలు శైలిమ,మనుమడు హిమాన్షు, కూతురు కవిత, అల్లుడు అనిల్ కుమార్ మనుమల్లు మనుమరాండ్లు ఇతర కుటుంబ సభ్యులు కార్యాలయ అధికారులు, సిబ్బంది తదిరులు పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: