ఓం నమో వేంకటేశాయ!!


• ఈ రోజు ఆదివారం,27.10.2019 ఉదయం 7 గంటల సమయానికి,తిరుమల: 19C°-27℃°
 
• కలియుగ దైవం,ఆపదమొక్కులవాడు, అనాధ రక్షకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి భక్తులకు దీపావళి శుభాకాంక్షల.


• నిన్న 77,238 మంది  భక్తులకు కలియుగ దైవం  శ్రీవేంకటేశ్వరస్వామి వారి  దర్శన భాగ్యం కల్గినది.


• స్వామివారి సర్వదర్శనం  కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 02  గదిలో భక్తులు వేచి ఉన్నారు.


 • ఈ సమయం శ్రీవారి  సర్వదర్శనాని కి సుమారు  05 గంటలు  పట్టవచ్చును.


• నిన్న 25,146 మంది   భక్తులు స్వామి వారికి   తలనీలాలు సమర్పించి    మొక్కులు తీర్చుకున్నారు.


• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు  సమర్పించిన నగదు  ₹: 3.20 కోట్లు.


•  శీఘ్రసర్వదర్శనం(SSD),  ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం. (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.


గమనిక:


#  ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి.


#ఈనెల 29న వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక ఉచిత దర్శనం,(భక్తులు రద్దీ సమయాల్లో ఇబ్బంది పడకుండా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలరు)


# ఈనెల 30 న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఉ: 9 నుండి మ:1.30 వ‌ర‌కు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.


వయోవృద్దులు / దివ్యాంగులకు  ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు.ఉ: 7 గంటలకి చేరుకోవాలి.ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు.


చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు:


• సుపథం మార్గం గుండా  శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు, ఉ:11  నుండి సా: 5 గంటల  వరకు దర్శనానికి  అనుమతిస్తారు.


శ్రీవేంకటేశ్వర సుప్రభాతం


!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!


తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది
కావున లెమ్ము స్వామి


మరింత సమాచారం తెలుసుకోండి: