ఓం నమో వేంకటేశాయ!!


• ఈ రోజు ఆదివారం, 10.11.2019 ఉదయం 6 గంటల సమయానికి, తిరుమల: 17C°-28℃°.


• నిన్న 84,351 మంది భక్తులకు కలియుగ దైవం  శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.


• స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 22  గదిలో భక్తులు వేచి ఉన్నారు.


 • ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 10 గంటలు పట్టవచ్చును.


• నిన్న 39,375 మంది భక్తులు స్వామి వారికి  తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.


• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 2.18 కోట్లు.


•  శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.


గమనిక:


# ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి.


# ఈనెల 12 మరియు 26న వృద్ధులు / దివ్యాంగులకు ప్రత్యేక ఉచిత దర్శనం, (భక్తులు రద్దీ సమయాల్లో ఇబ్బంది పడకుండా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోగలరు).


# ఈనెల 13 మరియు 27న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (ఉ: 9 నుండి మ:1.30 వ‌ర‌కు సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.


వయోవృద్దులు/ దివ్యాంగులకు  ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్వ ద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు.ఉ: 7 గంటలకి చేరుకోవాలి,ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు.


చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు:


• సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి  అనుమతిస్తారు, ఉ:11 నుండి సా: 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: