ప్రస్తుత  ప్రపంచంలో అంతుచిక్కని రహస్యాలు చాల  ఉన్నాయి. కేవలం ఈజిప్టు మిరమిడ్లు, బర్ముడా ట్రయాంగిల్ వంటివే కాకుండా.. ఇంకా చాలా రహస్యాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి అంటే  నమ్మండి. ఇలా  మిస్టరీగానే మిగిలిన వాటిలో ఒకటి కైలాశ ఆలయం. ఈ మిగిలిన వాటిలో మహారాష్ట్రలోని ఔరంగబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలో గల 32 ఎల్లోరా గుహల్లోని కేవ్ 16‌లో ఉంది.

 

ఈ కైలాశ ఆలయం గురించి మరాఠీ ఇతిహాసల్లో ఒక  కథ కూడా  ప్రాచుర్యంలో ఉంది అంటే  నమ్మండి. స్థానిక రాజు తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో అతడి భార్య శివుడిని ప్రార్థించడం జరిగింది. ఈ సందర్భంగా రాజు పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉంటే ఆలయాన్ని నిర్మిస్తారని తెలిపారు. ఆలయం గోపరం చూసేవరకు తాను ఉపవాసం చేస్తానని  కూడా మొక్కు కోవడం జరిగింది. దీంతో ఆ రాజు  ఆరోగ్యవంతుడిగా అయ్యాడు. రాణి మొక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండను తొలచి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఓ శిల్పి.. అలా నిర్మాణం చేపడితే.. ఆమె ఆలయ గోపురాన్ని చూసేందుకు కొన్ని వందల ఏళ్లు పడుతుందని తెలిపాడు. దీంతో ఆలయాన్ని ముందు నుంచి కాకుండా కొండ పై భాగం నుంచి చెక్కుకుని రావడం జరిగింది. ముందుగా ఆలయం గోపురాన్ని చెక్కి.. రాణిని ఉపవాస దీక్ష విరమించేలా చేశారు. అందుకే, ఈ ఆలయానికి అంత ప్రత్యేకత వచ్చిందని ఆ కథలో తెలియచేయడం జరిగింది.

 

రాళ్లు, సిమెంట్ వంటివి ఏవీ ఉపయోగించకుండా కేవలం రాతి కొండను ఆలయంగా మలచడం దీని ప్రత్యేకం. పైగా దీన్ని కొండ దిగువ భాగం నుంచి కాకుండా పై భాగం నుంచి కిందికి చెక్కుకుంటూ వెళ్లడం మరో అద్భుతం. అయితే, ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు. ఎందుకు నిర్మించారనేది ఇప్పటికీ రహస్యమే. టెక్నాలజీ అందుబాటులోలేని రోజుల్లో ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారంటే.. అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు కదా. పైగా, ఈ ఆలయం కింద 2 అడుగుల మనిషి మాత్రమే దూరేంత గుహ ఉంది.

 

పురావస్తు పరిశోధకుల అంచనాల ప్రకారం 4 లక్షల టన్నుల రాయిని ఉపయోగించి 150 ఏళ్లు  ఈ ఆలయాన్ని నిర్మించారని సమాచారం. ఈ ఆలయాన్ని నాశనం చేసేందుకు ఔరంగ జేబు తన సైన్యాన్ని పంపాడని, వారంతా మూడేళ్లు కష్టపడి కేవలం 5 శాతం మాత్రమే నాశనం చేయగలిగారని ఆ ఆనవాళ్లలో స్పష్టంగా కనిపిస్తుంది. 

 

ఇప్పటివరకు అంతా ఈ ఆలయ నిర్మాణమే పెద్ద మిస్టరీగా భావించారు. కానీ, దీని ‘కింద’ మరో మిస్టరీ దాగి ఉంది. అదే ‘అండర్ గ్రౌండ్’ సిటీ. దీని నిర్మాణాన్ని పరిశీలిస్తే.. దీన్ని నిర్మించడం మనుషుల వల్ల కాదని, ఆలయంలోని చెక్కిన రెండు అడుగుల సొరంగంలోకి మనిషి వెళ్లడం అసాధ్యం అనిపిస్తుందని అక్కడి ప్రజలు తెలిపారు. అలాగే, ఆలయం దిగువన గుండ్రని రంథ్రాలు సైతం ఎంతో లోతుగా ఉన్నాయని, ఇవన్నీ పరిశీలిస్తే.. ఈ ఆలయం కింద ఓ అండర్ గ్రౌండ్ సిటీ ఉందని తెలుస్తోంది. ఈ చిన్నని గుహల నుంచి కిందికి వెళ్లాలంటే అతి చిన్న మనుషులు లేదా పిల్లల వల్లే సాధ్యం. ఈ నేపథ్యంలో వేల ఏళ్ల కిందట ఏలియన్స్ ఇక్కడ సంచరించాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అలాగే, ఆ ఆలయం మీద ఉన్న కొన్ని శిల్పాల్లో చిన్న చిన్న ఆకారాల్లో ఉన్న రూపాలను ఉన్నాయని పరిశోధకుల వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: