ఆంధ్రప్రదేశ్ నుంచి అయ్యప్ప భక్తులు చాలామంది శబరిమల వెళ్తుంటారు. అలాంటి వారికి ఇది షాకింగ్ వార్తే.. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 40 ఏళ్ల అయప్ప భక్తుడు బుధవారం చనిపోయారు. అంతే కాదు.. మంగళవారం నీలిమల సమీపంలో శబరిమలకు వెళుతున్న తమిళనాడుకు చెందిన 29 ఏళ్ల భక్తుడు గుండెపోటుతో మృతి చెందారు.

 

ఇలా ఒక్క రోజు తేడాతో ఇద్దరు భక్తులు చనిపోవడం కలకలం సృష్టిస్తోంది. దీనికితోడు.. అయ్యప్ప స్వామి వారి ప్రసాదంలో బల్లి పడిందని, అందుకే భక్తులు మృతి చెందుతున్నారనే వదంతులు వ్యాపించాయి. అయితే దీనిపై స్పందించిన ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు ఇవన్నీ వదంతులేనని స్పష్టం చేసింది.

 

భక్తుల మరణానికి ప్రసాదానికీ సంబంధం లేదని ట్రావెన్ కోర్ బోర్డు తెలిపింది. అయితే ఇలా ఒక్క రోజు తేడాతో ఇద్దరు భక్తులు మరణించడం కలకలం రేపుతోంది. అయ్యప్ప భక్తులు శబరిమల యాత్రలో జాగ్రత్తగా ఉండాలని.. ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. దూరప్రయాణం కావడం వల్ల తగిన మందులు వెంట ఉంచుకోవాల్సిందిగా సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: