ఆంజనేయ స్వామిని ఎప్పుడు.. ఎలా పూజించాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ఇప్పటికే మీరంతా చేస్తూనే ఉంటారు..కానీ అసలు విధానం ఏ విధంగా ఉంటుందో  తెలియనట్లైతే ఈ కథనం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆరోగ్యానికి, శారీరక దృఢత్వానికి, స్థిరత్వానికి చిహ్నమూర్తి హనుమంతుడు. అలాంటి హనుమంతుడిని చైత్రమాసాన అంజనీమాత జన్మనిచ్చిన రోజు హనుమజ్జయంతి నాడు పూజిస్తే శుభఫలితాలుంటాయి. అలాగే వారాల్లో శనివారం, మాసంలో వచ్చే అమావాస్య నాడు హనుమంతుడిని కొలిచే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 

పూజించే విధానం..
హనుమంతుడిని పూజించడానికి ఆయన పటం ఎంచుకోండి. పువ్వులు, పండ్లు, బియ్యం, దీపం, మిఠాయిలు, మట్టికుండ అవసరం. హనుమజ్జయంతి రోజున గోధుమలు, పప్పు, బెల్లం, నెయ్యి, ఉప్పు, పసుపుకొమ్ములు, బంగాళాదుంపలు, ఏదైనా ఆకుపచ్చని కూరగాయల్ని బ్రాహ్మణులకు దానం చేయాలి. హనుమంతుడి పటాన్ని లేదా విగ్రహాన్ని ఓ ప్రదేశంలో వుంచి అలంకరించాలి. దీపం వెలిగించి పువ్వులు, పండ్లు, బియ్యం సమర్పించి పూజ చేయాలి.

ఇకపోతే.. హనుమంతుడికి సిందూరం అంటే మహాప్రీతి. సీతమ్మ తల్లిని నుదుటిపై సిందూరం పెట్టుకునే సంగతిని ఆరాతీయగా, శ్రీరాముడి అనుగ్రహం కోసమని సమాధానమిచ్చిందని, శ్రీరాముడి కోసం హనుమంతుడు శరీరం అంతా సిందూరం అద్దుకున్నాడని చెప్తారు. అనేకమంది భక్తులు బ్రాహ్మణులకు సిందూరం దానం చేస్తారు. హనుమంతుడిని పూజించేటప్పుడు హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేయడం మంచిది. హనుమజ్జయంతి రోజున మిఠాయిలను నైవేద్యం పెడితే శుభం కలుగుతుందని విశ్వాసం.

మరింత సమాచారం తెలుసుకోండి: