మూఢనమ్మకాల వల్ల చాలామంది మోసపోతూనేఉన్నారు.. పిల్లలు పుట్టకపోయిన, పెళ్లికాకపోయిన, గ్రహస్థితి బాగోలేకపోయిన ఇలా ప్రతిదానికి జ్యోతిష్యం, స్వామిజి లను నమ్మి ప్రజలు మోసపోతునేఉన్నారు. అలాంటి ఒక ఘటన విజయవాడ లోని ఒక యువతీ జీవితంలో చోటుచేసుకుంది.


విజయవాడ లోని ఈస్ట్ నియోజకవర్గం లోని అయోధ్య నగర్ కి చెందిన పరిమి సాయి ప్రియాంక తల్లితో కలిసి నివాసం ఉంటుంది. తండ్రి కొంతకాలం క్రితం చనిపోయాడు. సాయి ప్రియాంక కి ఎన్ని వివాహ సంబంధాలు చుసిన విఫలం అవుతూనే ఉన్నాయి. ఏదన్న జాతక దోషం ఉందేమో అని జ్యోతిషుడిని ఆశ్రయించింది. కృష్ణలంక పాత పోస్ట్ ఆఫీస్ రోడ్డులో నివాసం ఉంటున్న సనత్ చంద్ర ని కలిసి తన సమస్యని చెప్పుకుంది.


జ్యోతిష్యుడు జాతకం పరిశీలించి వివాహ దోషం ఉందని, పూజలు చేస్తే దోషం పోయి వివాహం జరుగుతుందని నమ్మపలికాడు. అతని మాటలు గుడ్డిగా నమ్మి లక్షలు లక్షలు ముట్టచెప్పింది. శాంతి పూజా అని యాభై వేలు తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా తమిళనాడు లోని అమ్మవారికి పూజా చేయిస్తే దోషం తగ్గుతుందని రెండున్నర లక్షలు తీసుకున్నాడు.

అక్కడకి తీసుకుని వెళ్లి ఏవో పూజలు చేయించి పంపించేశాడు. ఇంకా ముత్తయిదువులకు దానం చేయాలనీ మరొక లక్ష తీసుకున్నాడు. మళ్ళీ కొన్ని రోజులు అయ్యాక మరొక పూజా చేయాలనీ డబ్బులు అడిగాడు. తన దగ్గర డబ్బులు లేవని ఇప్పటికే ఐదు లక్షలు ఖర్చు పెట్టానని చెప్పడంతో, అప్పు ఇప్పిస్తా అని కాళీ ప్రామిసరీ నోట్స్ మీద, చెక్స్ మీద సంతకం పెట్టించుకున్నాడు.


పూజలు చేయకుండా తప్పించుకుని తిరుగుతుంటే చంద్ర ని పట్టుకుని నిలదీసింది. దానితో చంద్ర భూతులు తిట్టి, చంపేస్తానని బెదిరించాడు. దీనితో బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: