ఓం నమో వేంకటేశాయ!!

• ఈ రోజు సోమవారం,09.12.2019 ఉదయం 6 గంటల సమయానికి,తిరుమల: 16C°-23℃°

 

• నిన్న 83,973 మంది భక్తులకు కలియుగ దైవం  శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.

 

• స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం  క్యూ కాంప్లెక్స్ లో 05 గదిలో భక్తులు వేచి ఉన్నారు.

 

 • ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 06 గంటలు పట్టవచ్చును.

 

• నిన్న 31,851 మంది భక్తులు స్వామి వారికి   తలనీలాలు సమర్పించి  మొక్కులు తీర్చుకున్నారు.

 

• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 2.94 కోట్లు.

 

• నిన్న 18,182 మంది  భక్తులకు శ్రీ పద్మావతి  అమ్మవారి దర్శన భాగ్యం కలిగినది.

 

•  శీఘ్రసర్వదర్శనం(SSD),ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్  ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.

 

గమనిక:

2020 మార్చి నెలకి సంబంధిత ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ₹:300 కోటాను రేపు టిటిడి ఆన్‌లైన్‌, ఈ-దర్శన్‌ కౌంటర్లు, పోస్ట్ ఆఫీస్ ల్లో టికెట్లను విడుదల చేయ నున్నారు భక్తులు బుక్‌  చేసుకోవచ్చు.

 

# ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి, ఈనెల తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు.

 

•  నేడు చక్ర‌తీర్థ ముక్కోటి.

 

• 10న తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర‌,

 

• 11న కార్తీక దీపోత్స‌వం,శ్రీ తిరుప్పాణాళ్వార్ వ‌ర్ష తిరున‌క్ష‌త్రం, శ్రీ ద‌త్త జ‌యంతి.

 

• 17న ధ‌నుర్మాసం  ప్రారంభం.

 

• 25న శ్రీతొండ‌ర డిప్పొడియాళ్వార్ వ‌ర్ష తిరున‌క్షత్రం.

 

• 26న అధ్య‌య‌నోత్స‌వం, సూర్య‌గ్ర‌హ‌ణం.

 

వయోవృద్దులు/ దివ్యాంగుల ఎస్వీ మ్యూజియం
ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు.
ఉ: 7 గంటలకి చేరుకోవాలి.ఉ: 10 కి మరియుమ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు.

 

చంటి పిల్లల తల్లిదండ్రులు/ఎన్నారై ప్రత్యేక దర్శనాలు

 

• సుపథం ప్రవేశం ద్వారా స్వామి దర్శనానికి అనుమతిస్తారు, ఉ:11 నుండి సా: 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: