తిరుమల శ్రీవారి భక్తులకు ఇది నిజంగా గుడ్ న్యూస్.. శ్రీవారి భక్తుడు అన్నమయ్య దాదాపు 500ఏళ్లక్రితం కాలినడకన వెంకటేశ్వరస్వామని దర్శించుకున్న తీరు అపూర్వం. ఇప్పుడు ఆ కాలిబాటను ఏపీ సర్కారు అభివృద్ధి చేయబోతోంది. అన్నమయ్య నడిచిన కాలిబాటను అభివృద్ధి చేస్తామన్నాని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా ప్రకటించారు.

 

వైయస్‌ఆర్‌ సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డి చేపట్టిన 17తిరుమల మహా పాదయాత్రలో శనివారం ఆయన పాల్గొన్నారు. పల్లంపేట మండలం అప్పయ్యరాజు పేట వద్ద ఆకేపాటి పాదయాత్ర చేరుకున్న క్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా ఆకేపాటిని కలిశారు.

 

అనంతరం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడుతూ.. అన్నమయ్య కాలిబాట మార్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా సుముఖంగా ఉన్నారన్నారు. తిరుమల మహా పాదయాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అది సత్వరమే పూర్తి కావాలని కోరుకుందాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: