+ ఏపీ విషయానికి వస్తే.. లంబసింగి అత్యంత పర్యాటక ప్రాంతాల జాబితాలో చేరిపోయింది.
+ విజయవాడ సమీపంలోని భవానీ ఐలాండ్ సహా, గోదావరి, కృష్ణా నదుల సంగమ స్థలం కూడా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది.
+ విశాఖలోని ఆర్కే బీచ్ తొలి స్థానం నిలుపుకొంది. ఉత్తరాంధ్రలోనే కాకుండా రాష్ట్ర విభజనతో ఇప్పుడు విశాఖ దేశవ్యాప్తంగా మంచి పర్యాటక క్షేత్రంగాను. ఐటీ ప్రాంతంగాను విరాజిల్లుతోంది. రాష్ట్ర విభజన విశాఖ దశ, దిశను మార్చేసింది.
+ తిరుపతి పుణ్యక్షేత్రంగానేకాకుండా ఇటీవల కాలంలో పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందింది.
+ రాజధాని ప్రాంతంగా అమరావతి కూడా మంచి పర్యాటక ప్రాంతంగా ప్రజలు గుర్తించారు. ఇక్కడ అమరావతి రాజధానిగా ఉండడంతో రాజధాని చుట్టూ ఉన్న అనేక పుణ్యక్షేత్రాలు, ప్రాంతాలు కూడా పర్యాటకంగా మంచి అభివృద్ధి చెందాయి.
+ విశాఖలో బెలూన్ల ఫెస్టివల్ సహా ఐటీ రంగం అభివృద్దితో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది.
+ కడప దర్గా పర్యాటక జాబితాలో చేరిపోయింది
+ అనంతపురం సత్యాసాయి నిగమామగం.. మరో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు సాధించింది.
+ కోనసీమకు ఈ ఏడాది ఐఎస్ వో గుర్తింపు లభించింది. బందరు లడ్డూకు కూడా ఐఎస్ వో గుర్తింపు లభించింది.
+ తెలంగాణ విషయానికి వస్తే.. అత్యంత సుందర పర్యాటక ప్రాంతంగా హైదరాబాద్ తన పేరును మరోసారి నిలుపుకొంది. మరోసారి హైదరాబాద్ ప్రపంచ చిత్ర పటంపై తన బ్రాండ్ ఇమేజ్ చాటుకుంది.
+ వరంగల్ పర్యాటక కేంద్రంగా పేరు తెచ్చుకుంది. లక్నారం చెరువుతో పాటు ఈ ప్రాంతాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
+ యాదగిరి మహా ప్రాకార నిర్మాణంతో ఇప్పటికే ఉన్న పేరును మరింత ఇనుమడింప జేసుకుంది. యాదాద్రని దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పుణ్యక్షేత్రాల జాబితాలో చేర్చేలా కేసీఆర్ కంకణం కట్టుకుని మరీ అభివృద్ధి చేస్తున్నారు. యరో ఆరేడు నెలలకు యాదాద్రి పూర్తిగా నిర్మాణం జరుపుకోనుంది.