అతడు దైవ జ్ఞానాన్నే మోసాలకు ఆధారం చేసుకున్నాడు. స్వామీజి అవతారం ఎత్తి తనకు బాలాత్రిపుర సుందరీదేవి దర్శనమిచ్చిందని, తాను అమ్మవారికి సమస్యలు చెబితే తీరుస్తుందని నమ్మించి డబ్బులు వసూలు చేసేవాడు. 2012లో మాదాపూర్లో ఏఎ్సఆర్సీ కేంద్రాన్ని స్థాపించాడు. అక్కడ భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాల క్లాసులు చెప్పేవాడు. ఒక్కో క్లాస్కు వారి స్థాయిని బట్టి రూ. 10వేల నుంచి రూ. 2లక్షల దాకా వసూలు చేసేవాడు. తర్వాత భక్తుల సమస్యలను బట్టి వివిధ రకాల ఆధ్యాత్మిక తరగతులను కుబేర ప్రియ, అమృత ప్రక్రియ, కల్యాణ ప్రక్రియ, సంతాన ప్రక్రియగా విభజించాడు. వాటికి లక్షల్లో ఫీజు వసూలు చేసేవాడు. ఇలా ఒక్క ఏడాదిలో రూ.60కోట్లు దోచుకున్న బురిడీ బాబా ఈ ఏడాది ఇప్పటివరకు రూ.40కోట్లు కొల్లగొట్టాడు!
రెండేళ్లలోనే భక్తుల నుంచి రూ.100కోట్లు స్వాహా చేశాడు. ఏపీలోని నెల్లూరు జిల్లాకు చెందిన గిరీశ్ కుమార్ (34) దందా ఇదీ! ఎస్ఆర్ నగర్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. గిరీశ్ సింగ్ మాటకారి. అమాయకులను మోసగించేందుకు మాటే అతడి ఆయుధం! నిండా 35 ఏళ్లు లేకున్నా, చక్కగా ముచ్చట్లు చెప్పడంలో తల నెరిసిన వృద్ధులను మించిపోయాడు! చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో సూళ్లూరుపేటలోని అమ్మమ్మ ఇంట్లో పెరిగాడు. ఇంటర్తో చదువు మానేశాడు. ఇంటిపక్కనే ‘బాలాత్రిపుర సుందరీదేవి’ ఆలయం ఉండటంతో అక్కడికి వెళ్లి ఆధ్యాత్మిక ప్రవచనాలు వినేవాడు.
2024లో దేశానికి తానే ప్రధానినవుతానని డబ్బా కొట్టుకునేవాడు. కొన్నాళ్లకు 30 స్టార్ట్పలను ప్రారంభించానని.. అందులో రూ.1100 నుంచి రూ.66వేల దాకా పెట్టుబడి పెట్టొచ్చని.. ఒకరు, నలుగురిని.. ఆ నలుగురు మరో నలుగురి చొప్పున చేర్చుకుంటూ వెళితే కోట్లలో కమిషన్ వస్తుందని నమ్మించాడు. భక్తుల నుంచి లక్షల్లో వసూలు చేశాడు. కొందరైతే రూ.2కోట్ల నుంచి రూ.4కోట్లదాకా పెట్టుబడి పెట్టారు. ఇలా గత ఏడాది భక్తుల నుంచి ఆన్లైన్ ద్వారానే రూ. 60 కోట్లు కొల్లగొట్టాడు. ఆ డబ్బునంతా 16 బ్యాంకుల్లో జమచేశాడు. ఈ క్రమంలోనే 2012లో మాదాపూర్లో ఏఎస్ఆర్సీ కేంద్రాన్ని స్థాపించి భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పేవాడు. ఒక్కో క్లాస్కు భక్తుల స్థాయిని బట్టి రూ. 10వేల నుంచి రూ. 2లక్షల దాకా వసూలు చేసేవాడు.
కొన్నాళ్లకు 30 స్టార్ట్పలను ప్రారంభించానని.. అందులో రూ.1100 నుంచి రూ.66వేల దాకా పెట్టుబడి పెట్టొచ్చని.. అందులో చేరిన సభ్యులు ఇతరులను చేరిస్తే రూ.కోట్లలో కమిషన్ వస్తుందని నమ్మించాడు. అతడి మాటలు నమ్మి కొందరు రూ.కోట్లలో పెట్టుబడి పెట్టారు. దీంతో 2018లో ఏకంగా రూ.60కోట్లు సంపాదించాడు. ఈ బురిడీ బాబా లీలలపై ఫిర్యాదులు రావడంతో గతేడాది డిసెంబరు 24న రాచకొండ పోలీసులు గిరీశ్ను అరెస్ట్ చేశారు. అయితే తనకున్న డబ్బు, పలుకుబడితో కొద్దిరోజుల్లోనే బెయిల్పై వచ్చేశాడు. మరోసారి అలాంటి ప్రకటనే చేసి ఈ ఏడాది రూ.40కోట్ల వరకు దోచేశాడు. ఆ డబ్బుతో ఖరీదైన కార్లు కొనడం, విదేశాల్లో ఎంజాయ్ చేసేవాడని పోలీసులు చెబుతున్నారు. గిరీశ్పై మోసాలపై లోతుగా దర్యాప్తు చేసేకొద్దీ అనేక విషయాలు వెలుగులోకి వస్తుండటంతో పోలీసులే షాకవుతున్నారు.