ఓం నమో వేంకటేశాయ!!
 
 
• ఈ రోజు సోమవారం,23.12.2019 ఉదయం 5 గంటల సమయానికి,తిరుమల: 16C°-24℃°
 
 
• నిన్న 85,869 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.
 
 
• స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 26 గదిలో భక్తులు వేచి ఉన్నారు.
 
 
 • ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 16 గంటలు పట్టవచ్చును.
 
 
• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 3.07 కోట్లు.
 
 
• నిన్న 32,489 మంది భక్తులు స్వామి వారికి  తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
 
 
•  శీఘ్రసర్వదర్శనం(SSD),ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.
 
 
• ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి,
 
 
గమనిక:
 
జ‌న‌వ‌రి 1, వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా 
 
• రద్దీని దృష్టిలో ఉంచుకుని దాత‌ల‌కు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు, వృద్ధులు, దివ్యాంగులకు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలను నిలుపుద‌ల చేయ‌డ‌మైన‌ది.
 
 
• నూతన ఆంగ్ల సంవత్సరాది సంద‌ర్భంగా డిసెంబరు 30 నుండి జనవరి 1వ తేదీ వరకు, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 4 నుండి 7వ తేదీ వరకు దాతలకు ప్రత్యేక దర్శనాలు, గదుల కేటాయింపును నిలిపివేయ‌డ‌మైన‌ది.
 
 
• భక్తుల రద్దీ నేపథ్యంలో నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 5 నుండి 7వ తేదీ వరకు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక దర్శనాలు ర‌ద్దు చేయ‌డ‌మైన‌ది.ఈనెల తిరుమలలో
ప్రత్యేక ఉత్సవాలు
 
 
• 25న శ్రీతొండ‌ర డిప్పొడియాళ్వార్ వ‌ర్ష తిరున‌క్షత్రం.
 
• 26న సూర్య‌గ్ర‌హ‌ణం.
 
• 31 న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం,
 
వయోవృద్దులు/ దివ్యాంగుల ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఉ: 7 గంటలకి చేరుకోవాలి, ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు.
 
 
చంటి పిల్లల తల్లిదండ్రులు/ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
 
• సుపథం ప్రవేశం ద్వారా స్వామి దర్శనానికి అనుమతిస్తారు, ఉ:11 నుండి సా: 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: