ఓం నమో వేంకటేశాయ!!

 

• ఈ రోజు మంగళవారం,24.12.2019 ఉదయం 6 గంటల  సమయానికి,తిరుమల: 19C°-24℃°

 

• నిన్న 78,349 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.

 

• స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 24 గదిలో భక్తులు వేచి ఉన్నారు.

 

 • ఈ సమయం శ్రీవారిసర్వదర్శనాని కి సుమారు 24 గంటలు పట్టవచ్చును.

 

• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 2.64 కోట్లు.

 

• నిన్న 30,529 మంది భక్తులు స్వామి వారికి  తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు

 

• నిన్న 19,406 మంది భక్తులకు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన భాగ్యం కలిగినది.

 

•  శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.

 

• ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి.

 

గమనిక:

 

జ‌న‌వ‌రి 1, వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా  రద్దీని దృష్టిలో ఉంచుకుని దాత‌ల‌కు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు, వృద్ధులు, దివ్యాంగులకు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలను నిలుపుద‌ల చేయ‌డ‌మైన‌ది.

 

• నూతన ఆంగ్ల సంవత్సరాది సంద‌ర్భంగా డిసెంబరు 30 నుండి జనవరి 1వ తేదీ వరకు, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 4 నుండి 7వ తేదీ వరకు దాతలకు ప్రత్యేక దర్శనాలు, గదుల కేటాయింపును నిలిపివేయ‌డ‌మైన‌ది.

 

• భక్తుల రద్దీ నేపథ్యంలో నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా డిసెంబరు 31, జనవరి 1వ తేదీల్లో, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా జనవరి 5 నుండి 7వ తేదీ వరకు వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక దర్శనాలు ర‌ద్దు చేయ‌డ‌మైన‌ది.

 

ఈనెల తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు

• రేపు శ్రీతొండ‌ర ‌డిప్పొడియాళ్వార్ వ‌ర్ష తిరున‌క్షత్రం.

• 26న సూర్య‌గ్ర‌హ‌ణం.

• 31 న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.

మరింత సమాచారం తెలుసుకోండి: