తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను … ఆప్యాతానురాగాలను … పల్లె సొగసులను అందంగా ఆవిష్కరించే పెద్ద పండుగలో, భోగి .. సంక్రాంతి తరువాత రోజున ‘కనుమ’ పండుగ. పల్లె జీవన విధానాన్ని … పశువులతో .. పంటలతో అక్కడి వారికి గల అనుబంధాన్ని ఈ పెద్ద పండుగ అందంగా ఆవిష్కరిస్తూ వుంటుంది.సంక్రాంతి తర్వాత వచ్చేది కనుమ. పశువుల పండుగగా వ్యవహరిస్తారు.పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను పూజిస్తారు.

 

సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు.. ఇక మూడవ రోజైన ‘కనుమ’ పండుగ రోజున పశువులను అందంగా అలంకరించి పూజిస్తారు. పల్లె జీవన విధానంలో పాడి విషయంలో ఆవులు…వ్యవసాయం విషయంలో ఎద్దులు గ్రామస్తులకు ఎంతగానో తోడ్పడుతుంటాయి.

 


తమకి సుఖ సంతోషాలను అందించడం కోసం అహర్నిశలు కష్టపడుతూ అవి పోషిస్తోన్న పాత్రను వాళ్లు మరిచిపోరు. తమ జీవనాధారమైన పశువుల పట్ల కృతజ్ఞతగా వాళ్లు ‘కనుమ’ రోజున వాటికి విశ్రాంతినిచ్చి పూజిస్తారు. వాటితో తమకి గల అనుబంధాన్ని చాటుకుంటారు. కనుమ రోజున వాళ్లు పశువులను నదీ తీరాలకు గానీ, చెరువుల దగ్గరికి గాని తీసుకు వెళ్లి స్నానం చేయిస్తారు.


ఆ పశువుల నుదుటున కుంకుమ దిద్ది .. వాటి మెడలో మువ్వల పట్టీలు కడతారు. వాటి కొమ్ములకు ప్రత్యేకంగా తయారు చేయబడిన వివిధ రకాల కొప్పులను తగిలిస్తారు. వీపు పై అలంకార శోభితమైన పట్టీ తగిలిస్తారు. అలంకరణ పూర్తయిన తరువాత వాటిని పూజించి హారతిని ఇస్తారు. పశువులకు ఇష్టమైన ఆహారాన్ని సమర్పించి వాటిని ఉత్సాహంగా ఊరేగిస్తారు. చాలా చోట్ల ఈ రోజున కోడిపందేలు, ఎడ్ల పందేలు నిర్వహిస్తుంటారు.

 

అయితే, వీటిని జీవహింసగా భావించిన రైతులు వీటన్నింటిని రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.రోజున పెద్దలకు తర్పణాలు కూడా ఇస్తుంటారు.కనుమ రోజున పెరుగుని దానం ఇస్తే మంచి జరుగుతుందని చెబుతుంటారు.ఈ రోజున చాలామంది మాంసాహారం చేసుకుని వనభోజనాలు పెట్టుకుంటారు.. చనిపోయిన పెద్దలకి మాంసాహారం నైవేద్యం పెట్టుకుని పెద్దల్ని స్మరిస్తారు. కనుమ నాడు మినుములు తినడం అనేది ఆనవాయితీ. అందుకే ప్రజలు ఆరోజున గారెలు, ఆవడాలు చేసుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: