సంక్రాంతి తెలుగు వారి పండుగలలో ప్రధానమైనది మరియు పెద్దది. కేవలం ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలే కాదు తమిళనాడు, కర్నాటక మరియు ఇతర రాష్ట్రాలలో కూడా జరుపుకుంటారు. పాశ్చాత్య దేశాలలో సెటిల్ అయిన ప్రవాసాంధ్రులు కూడా సంక్రాంతి జరుపుకోవడం విశేషం.

 

సంక్రాంతి పండుగలో ముఖ్యమైనవి మూడు - భోగి, మకర సంక్రాంతి, కనుమ.భోగి పండగ మకర సంక్రాంతికి ముందొచ్చే రోజు. సాధారణంగా ఆ రోజున భోగి మంటలు వేస్తారు. ఇంట్లో ఏదైనా పాత సామాన్లు (మంటల్లో కాలేవి) ఉంటే వాటిని తీసుకొచ్చి ఆ మంటలో వేస్తుంటారు. చలి కాలంలో అత్యంత చలిగా ఉండే రోజు భోగి. భోగి మంటలకు ఎక్కువగా తాటాకులను ఉపయోగిస్తారు. ఉదయం 3 నుండి 5 గంటల మధ్య భోగి మంటలను వేసుకుంటారు.

 

కొత్త బట్టలు ధరించడం, గాలి పటాలు ఎగరేయడం, కోళ్ళ పందేలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.భోగి పండుగ నాడు చేసే మరో సంప్రదాయం రేగు పండ్లు పోసి ఆశీర్వదించడం. భోగి నాడు పోస్తారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన కాలమే మకర సంక్రాంతి. ఇది హిందువుల పెద్ద పండగ. తెల్లవారుజామునే లేచి స్నానాలు ఆచరించి కొత్త బట్టలు ధరిస్తారు. మకర సంక్రాంతిని తమిళులు 'పొంగల్' గా వ్యవహరిస్తారు.

 

మకర సంక్రాంతి రోజున డూ డూ బసవన్నలు, పిండి వంటలు తయారు చేస్తారు. హరిదాసు గమనించవచ్చు. భోగి తరువాత వచ్చే సంక్రాంతి రోజున ఇంట్లో పాలు పొంగించి, నేతి మిఠాయిలు,పిండి వంటలు తయారుచేస్తారు.అరిసెలు, గారెలు, బొబ్బట్లు, జంతికలు, పరమాన్నం, పులిహోరా వంటివి.కోళ్ళ పందేలు సంక్రాంతి పండగ నాడు నిర్వహించే ఒక క్రీడ. ఈ క్రీడలో పాల్గొనటానికి రాష్ట్రం నలుమూల నుంచే కాక కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాల నుంచి కూడా వస్తారు.

 

కోళ్ళ మీద పందేలు కాస్తారు. పౌరుషానికి ప్రతీకగా ఉండే కోళ్ళు పోటీలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతాయి. ఈ పందేలను తిలకించేందుకు ప్రజలు ఆసక్తికి కనబరుస్తారు.కోళ్ళ పందేలు ఎక్కువగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా లతో పాటు ఇతర కోస్తా జిల్లాలలో జరుగుతాయి.పండుగ మూడవ రోజు కనుమ.

 

సాధారణంగా ప్రజలు వ్యవసాయంలో తమకు సహాయపడిన పశువులకు శుభాకాంక్షలు తెలపటానికి ఈ రోజును జరుపుకుంటారు. కనుమ నాడు మినుములు తినాలనేది సామెత. అందుకే ఆ రోజున ప్రత్యేకంగా ఆవడలు, గారెలు చేసుకోవడం ఆనవాయితీ. వనభోజనాలు కూడా ఈ రోజే నిర్వహిస్తుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: