సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇంటింటా సంబరమే. చిన్నా, పెద్దా.. వయసు తారతమ్యం లేకుండా పండుగ సంబరాల్లో మునిగిపోతారు. అదే ఓ సినిమా సెలబ్రిటీ కుటంబం అంతా కలిసి ఓ చోట సంబరాలు చేసుకుంటే ఇంకా స్పెషల్. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ ఇదే చేస్తోంది. అసలే మెగా ఇంట హీరోలు, నటులు కలిస్తే ఓ క్రికెట్ టీమ్ లా ఉంటుంది అనే సినీ నానుడి కూడా ఉంది. ఇంకేముంది.. సంక్రాంతి సందడంతా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో కొలువుదీరిందా అన్నట్టు వారింట సంబరాలు మొదలైపోయాయి.
చిరంజీవి తమ్ముళ్లు, చెల్లెళ్లు.. వారి పిల్లలతో సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి. భోగి సందర్భంగా చలిమంట కాచుకుంటూ పండుగను ప్రారంభించేశారు. చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, వరుణ్ తేజ్, నిహారిక, సాయి ధరమ్ తేజ్, సుస్మిత.. ఆమె పిల్లలు, శ్రీజ కూతురు.. ఇలా పిల్లలు పెద్దలు అందరూ చిరంజీవి ఇంట్లో చేరిపోయారు. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా పవన్–రేణు దేశాయిల గారాలపట్టీ ఆద్య కూడా ఉంది. ఇంతమందిలో ఆద్య స్పెషల్ గా కనిపిస్తోంది. భోగి మంట వేసి చలి కాచుకుంటూ చిరంజీవితో సహా చలిలో ఉన్న ఫోటోలు రామ్ చరణ్, వరుణ్, సాయి ధరమ్ తేజ్ తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి.
Me and my cuties wishing you all a very happy bhogi!#bhogi #festivemood pic.twitter.com/i1rZklo2rd
— varun Tej konidela 🥊 (@IAmVarunTej) January 14, 2020
పండుగ, సెలవులు.. అతెందుకు వీకెండ్స్ లో కూడా మెగా ఫ్యామిలీ అంతా చిరంజీవి ఇంట్లో చేరిపోతారనే విషయం తెలిసిందే. అలాంటిది.. ఇంత పెద్ద పండుగ వస్తే ఆ అల్లరే వేరుగా ఉంటుంది. నిత్యం షూటింగ్స్ తో బిజీగా ఉన్నవారు ఇప్పుడు సెలవు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ పిక్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
మీకు,మీ కుటుంభ సభ్యులందరికి భోగి పండగ శుభాకాంక్షలు #family #love #bhogi #sankranthivibes pic.twitter.com/q8cGQq0a3J
— Sai Dharam Tej (@IamSaiDharamTej) January 14, 2020