ఓం నమో వేంకటేశాయ!!

 

• ఈరోజు సోమవారం,20.01.2020 ఉదయం 5 గంటల సమయానికి,తిరుమల: 15C°-26℃°.

 

• నిన్న 95,327 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం లభించింది.

 

• వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 05 కంపార్ట్మెంట్ లో సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు.

 

 • ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 06 గంటలుv పట్టవచ్చును.

 

• నిన్న 30,358 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

 

• నిన్న స్వామివారికి హుండీ లో భక్తులు సమర్పించిన నగదుv ₹: 3.31 కోట్లు.

 

• నిన్న 21,453 మంది భక్తులకు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన భాగ్యం కలిగినది.

 

• శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.

 

గమనిక:

 

• నేటి నుండి శ్రీవారిని దర్శించుకొను ప్రతి భక్తులకు ఒక లడ్డూ ఉచితంగా ఇవ్వనున్న తిరుమల తిరుపతి దేవస్థానం.

 

• ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి.

 

ప్రత్యేక దర్శనాలు:

జనవరి 21, 28వ తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులకు
  శ్రీవారి ప్రత్యేక దర్శనం.

జనవరి 22, 29వ తేదీల్లో 5 ఏళ్లలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం.

 

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

 

తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది
_కావున లెమ్ము స్వామి.

మరింత సమాచారం తెలుసుకోండి: