తిరుమ‌ల‌లో ఒక రోజు బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వచ్చిన భక్తకోటి గోవింద నామ స్మరణలతో తిరుమల గిరులు మార్మోగాయి. రోజంతా నాలుగు మాడవీధులు భక్తకోటితో కిటకిటలాడిపోయాయి.  రథ సప్తమి వేళ తిరుమల నాలుగు మాడ వీధల్లో సప్త వాహనాలపై మలయప్ప స్వామి ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. దాదాపు 2.5 లక్షల మంది భక్తులు రథ సప్తమి వేడుకలను తిలకించేందుకు వచ్చినట్లు టీటీడీ అధికారులు అంచనావేస్తున్నారు.

 

ఇల వైకుంఠం తిరుమలలో రథ సప్తమి వేడుకలు శనివారం వైభవోపేతంగా జరిగాయి. రథ సప్తమి సందర్భంగా సప్త వాహనాలపై మలయప్ప స్వామి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు.  ఒక రోజు బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు దాదాపు రెండున్నర లక్షల మంది భక్తులు తిరుమలకు వచ్చారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులు అంచనావేస్తున్నారు. సూర్యోదయాన ఉదయం 5.30 గంలకు సూర్యప్రభ వాహనసేవతో మొదలైన రథ సప్తమి వేడుకలు...రాత్రి 8 గం.లకు చంద్రప్రభ వాహనసేవతో ముగిశాయి. మధ్యాహ్నం పుష్కరిణిలో చక్రస్నాన ఘట్టాన్ని నిర్వహించారు.

 

కొనసాగుతున్న భక్తుల రద్దీ

మరింత సమాచారం తెలుసుకోండి: