ఓం నమో వేంకటేశాయ!!

 

• ఈరోజు గురువారం,13.02.2020 ఉదయం 5 గంటల  సమయానికి, తిరుమల: 15C°-27C°

 

• నిన్న 61,870 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం లభించింది.

 

• వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 01 కంపార్ట్మెంట్ లలో సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు.

 

 • ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు  04 గంటలు  పట్టవచ్చును.

 

• నిన్న 22,869 మంది భక్తులు స్వామి వారికి  తలనీలాలు సమర్పించి  మొక్కులు తీర్చుకున్నారు.

 

• నిన్న స్వామివారికి హుండీ లో భక్తులు సమర్పించిన నగదు  ₹: 3.21 కోట్లు.

 

• నిన్న 14,987 మంది భక్తులకు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన భాగ్యం కలిగినది.

 

• శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.

 

గమనిక :

 

ఫిబ్రవరి 21న గోగ‌ర్భ తీర్థంలోని క్షేత్ర‌పాల‌కునికి మ‌హాశివ‌రాత్రి వేడుక‌లు

• ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన భాగ్యం  కల్పించిన టిటిడి,

 

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌

 

తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది కావున లెమ్ము స్వామి

మరింత సమాచారం తెలుసుకోండి: