పరమశివుణ్ని భక్తి శ్రద్ధలతో పూజించిన, తక్షణమే కోరిన కోరికలు తీరును. తాను, ఇబ్బందులు ఎదుర్కొంటానని తెలిసినా, దానవుల అసంబద్ధమైన కోరికలను తీర్చిన భోలా శంకరుడాయన. ఎలా అంటే..  గరళాన్ని కంఠంలో ఉంచుకొని నీల కంఠుడయ్యాడు. కానీ, అదే శివుడికి కోపం వస్తే  మాత్రం.. మహా ప్రళయం సంభవించును. అందుకే ఆ పరమేశ్వరుణ్ని ప్రళయకారుడిగా భావిస్తారు. లింగోద్భవ కాలం ప్రకారం.. జన్మాష్టమి నుంచి ఆరు మాసాలు అంటే.. 180 రోజులు లెక్కిస్తే శివరాత్రి వస్తుందని శాస్త్రం చెబుతుంది. 

 

నికారుడైన పరమేశ్వరుడు.. జ్యోతి స్వరూపాన్ని కలిగి ఉండును, లింగరూపంలో అవిర్భవించిన కాలం కాబట్టి ఈ శివరాత్రిని లింగోద్భవకాలం అంటారు. పరమేశ్వరుడి 64 రూపాలలో లింగోద్భవమూర్తి చాలా ముఖ్యమైనది. లింగోద్భవం జరిగింది అర్థరాత్రి పన్నెండు గంటలని పురాణాలలో పేర్కొన్నారు. ఋగ్వేదం ప్రకారం.. భక్తులు ఉపవాసం ఉండి, జాగారణం చేసి, మహాలింగ దర్శనం చేసుకుంటారు. ఉపవాస దీక్షను స్త్రీ, పురుషులు అనే భేదం లేకుండా, అన్ని వేళలయందును కూడా ఆచరించవచ్చు. 

 

శివ లింగాలు ఆరువిధాలుగా పరిఢవిల్లాయి.. ఇవి ఒక్కొక్క విధానంలో ఆరేసి లింగాలు.. ద్వివిదా ద్వాదశ లింగాలుగా చెప్పబడుతున్నాయి. అయితే, శివాగమాలరీత్యా మాత్రం, ఆచార గర్వాది లింగాలే సరియైనవి కాబట్టి, ఈ ఆరులింగాలనే అను నిత్యం ఆరాధించాలి. శివరాత్రి పర్వదినం నాడు శంకరుడ్ని ఎన్నో విధాలుగా ఆలంకరిస్తారు. ఆ అలంకరణలో విభూతిధారణ ఒకటి. విభూతి అంటే ఐశ్వర్యం. అది అగ్నిలో కాలిన శుద్ధమైన వస్తువు. ఈశ్వరుడు తన శరీరమంతా విభూతి పూసుకుంటాడు అనే సంగతి మనకు విదితమే. 

 

రెండోది రుద్రాక్ష. రుద్రాక్ష అంటే శివుని మూడో నేత్రంగా చెప్పబడును. దేవతలందరిలోనూ ఫాలభాగంలో కన్ను గలవాడు ఆయన ఒక్కరే. మూడోది పంచాక్షరి జపం. పంచాక్షరీ మంత్రోపదేశం లేనివారు, శివనామం  జపిస్తే చాలు. నాలుగోది మారేడు దళాలతో శివున్ని పూజించడం. శివునికి మూడు దళాలుంటాయి. ఐదోది అంతరంగంలో శివ స్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి. ఇలా.. పలు రకాలుగా ఆ పరమ శివుని ఆరాధించిన, జనులకు శుభం చేకూరును.

మరింత సమాచారం తెలుసుకోండి: