సాధారణంగా మన ఇంట్లో పూజా గది అంటే పరమ పవిత్రంగా చూస్తుంటాం. ఇక్కడ అన్ని రకాల దేవుళ్ల విగ్రహాలు పెట్టి పూజించాలని చూస్తుంటాం. మనకు మనశ్శాంతిని, ధైర్యాన్ని,ప్రశాంతతను ఇచ్చే గది మన ఇంట్లో పూజ గది. అలాంటి పూజ గదిలో ఎలాంటి విగ్రహాలను పెట్టాలి, ఎలాంటి విగ్రహాలను పెట్టకూడదు అనేది చాలామందికి తెలీక ఏవేవో విగ్రహాలను తీసుకుని వచ్చి పెట్టి లేని పోనీ కష్టాలను తెచ్చుకుంటారు.  కానీ ఇక్కడ కొంత మంది తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. 

 

నిలబడి ఉన్న వినాయకుడి, సరస్వతీ దేవి విగ్రహాలను ఇంట్లో పెట్టకూడదు. వినాయక మరియు సరస్వతి దేవి విగ్రహాలు ఉండటం ఇంటికి చాలా మంచిది.అలాగే నిలబడి ఉన్న లక్ష్మి దేవి ఉంటె ఆ ఇంట్లో లక్ష్మి నిలవదు. కాని, నిలబడి ఉంటె ఇంటికి అరిష్టం. పది ఇంచులు కన్నా పెద్దగా ఉన్న విగ్రహాలను ఇంట్లో పెట్టకూడదు. పెద్ద పెద్ద విగ్రహాలు గుడిలో మాత్రమే పెట్టాలి. అలాగే ఇంట్లో ఎక్కువ విగ్రహాలు కూడా పెట్టకూడదు.  అయితే కొంత మంది కులదైవానికి చెందిన విగ్రహాలను కూడా పెట్టుకొని పూజిస్తుంటారు. 

 

అయితే బయటనే ఎక్కువ గుడి కట్టి పూజిస్తుంటారు.  పూజ గది వాస్తు ప్రకారం లేకపోతే.. కుటుంబ సభ్యులు మానసిక ప్రశాంతత కోల్పోతారు. దేవుడిని నేల మీద కాకుండా కొంచెం ఎత్తులో మనం కూర్చుంటే, దేవుడి పాదాలు మన చాతీ దగ్గరకు రావాలి. వాస్తు శాస్త్రం ప్రకారం పూజగది ఈశాన్యం దిశగా ఉండాలి. చనిపోయిన పెద్దవాళ్ల ఫోటోలు వాయువ్య దిశగా ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: