ఓం నమో వేంకటేశాయ!!
• ఈరోజు శుక్రవారం,13.03.2020 ఉదయం 6 గంటల సమయానికి, తిరుమల: 17C°-30C°
• నిన్న 61,652 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కలిగింది.
• వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 11 కంపార్ట్మెంట్ లో భక్తులు సర్వదర్శనం కొరకు వేచి ఉన్నారు.
• ఈ సమయం శ్రీవారి ఉచిత దర్శనానికి సుమారుగా 05 గంటల సమయం పట్టవచ్చును.
• నిన్న స్వామివారికి హుండీ లో భక్తులు సమర్పించిన నగదు ₹: 2.34 కోట్లు.
• నిన్న 14,550 మంది భక్తులకు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన భాగ్యం కలిగినది.
• శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.
• ₹:10,000/- విరాళం ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక విఐపి బ్రేక్ దర్శన సౌకర్యం కలదు.
ముఖ్య గమనిక:
• అస్వస్థత కి లోనైన భక్తులు తిరుమలకి రావొద్దు.
• విదేశాల నుండి వచ్చిన వారు 28 రోజుల వరకు తిరుమల యాత్ర కి రావొద్దు.
• అలిపిరి, శ్రీవారి మెట్టు మరియు టోల్ గేట్ వద్ద భక్తులకు వైద్యపరిక్షలు నిర్వహిస్తున్నారు.
• అస్వస్థత కి గురైన భక్తుల యాత్రను రద్దు చేసుకొని వారి టికెట్టును dyeotemple@ gmail.com కి మెయిల్ చేస్తే మరో రోజుకి దర్శనం ఏర్పాటు చేయబడును లేదా నగదు తిరిగి చెల్లించబడును.
• భక్తులు సహకరించ వలసిందిగా ప్రార్థన.
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్
తా: కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది కావున లెమ్ము స్వామి.