ఉగాది అంటే.. యుగానికి ఆది అనే అర్థం వస్తుంది. ఈ పండగ జరుపుకోని తెలుగు వారు ఉండరు. ఈ ఉగాది ఒక్క తెలుగువారే కాకుండా దక్షినాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా, మహారాష్ట్ర ప్రజలు కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ పండగను ష‌డ్రుచుల  సమ్మేళనంగా పిలుస్తారు. ఆ రోజు ఉగాది ప‌చ్చ‌డి, పిండివంట‌లు, మామిడి తోరణాలతో తెలుగు లోగిళ్లు అన్ని కళకళలాడుతాయి. ఈ పండగ చైత్ర మాస చైత్ర మాస శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. 

 

ఇక ఉగాది రోజునే.. బ్రహ్మ సమస్త సృష్టినీ ప్రారంభించాడని చెబుతారు. వైకుంఠనాథుడు మత్స్యావతారాన్ని ధరించి, సోమకుడిని సంహరించి వేదాలను కాపాడింది కూడా ఉగాది రోజునే. అలాగే ఈ ఏడాది ఉగాది 2020 మార్చి 25వ తేదీన వస్తోంది. ఆ రోజున తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పండుగ వాతావరణం కనిపిస్తుంటుంది. కానీ ఈసారి కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల‌ దేవాలయాలలో కాస్త జనసాంద్రత తక్కువ కనిపించే అవ‌కాశాలు ఉన్నాయి. అయితే పంచాంగం ప్రకారం ఉగాది రోజున ఎప్పుడు ఏం చేయాలి? మంచి ఘడియలు ఎప్పుడు? ఆసమయంలో ఏం చేయాలి? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. 

 

ఎందుకంటే.. మ‌న‌కు తెలియ‌కుండా కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. పండుగ రోజంతా ఉంటుంది కాబ‌ట్టి చేయాలనుకున్న పనులు ఏ సమయంలో అయినా చేయవచ్చు అనుకుంటారు. కానీ, అది క‌రెక్ట్ కాదు. మంచి స‌మ‌యంలో మంచి ప‌నులు చేస్తేనే క‌ష్టాలు ద‌రిచేర‌కుండా ఉంటాయి. ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే.. 25వ తేదీ, అనగా బుధవారం ఉదయం గం. 6 నుండి 11 గం. లోపు ప్ర‌తి ఒక్క‌రూ ఉగాది పూజను పూర్తి చేసుకోవాలి. ఆ సమయంలోనే ఉగాది పచ్చడిని కూడా చేసేసుకోవాలి. ఇక ఉగాది రోజున పడమర దిశకు ప్రయాణం చేయడం మంచిది. 

 

25వ తేదీ ఉదయం 6గంటల నుండి 11 గంటల వరకూ అలాగే మద్యాహ్నం 1:30 నిమిషాల నుండి సాయంత్రం 4.30 నిమిషాల సమయంలో ప్రయాణాలు శుభం కలిగిస్తాయి. అయితే ఉత్తర దిశ ప్రయాణాలు కలిసిరావు. కాబ‌ట్టి ఆ దిశ‌వైపు ప్ర‌యాణం స్టాట్ చేయకండి. అలాగే ఉదయం 11 గంటల లోపు కొత్త వస్తువులు కొనుగోలు చేయడం ఉత్త‌మం. ఉదయం పూజ సమయంలో లేదా మద్యాహ్నం 1:30 నిమిషాల నుండి సాయంత్రం గం.4.30 లోపు కాని అకౌంట్స్‌ పుస్తకాలు ప్రారంభించుకోవడం వల్ల అంతా శుభం జరుగుతుంది. వ్యాపారులు లాభాలు కూడా పొందొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: