పూర్వం బలి చక్రవర్తిని బంధించి పాతాళమునకు వామనుడు పంపినది ఈ రోజే !రావణుని చంపి రాముడు సీతమ్మతో కలిసి వెళ్ళి భరతుని చూసినది ఈ రోజే! క్రూరుడౌ నరకాసురుని సత్యభామ కృష్ణుడు వెంట నుండగా హతమార్చినది ఈ రోజే! విక్రమార్కుడు శత్రు విజయాన్ని సాదించి తన పేర శకము ప్రారంభించినది ఈ రోజే! "దీపావళి పర్వదినము". అలాంటి శుభదినం గూర్చి తెల్సుకుందాము.

శ్రీమహా విష్ణువు వామనావతారుడై కృతయుగంలో రాక్షసరాజు బలి చక్రవర్తిని పాతాళానికి అణచివేశాడు. అది బలిపాలన అంతమైన రోజు. ఆ రోజున దీపావళిని జరుపుకున్నారు.ఇక ద్వాపర యుగంలో నరకాసురుణ్ణి వధించిన రోజునే దీపావళిగా మనం జరుపుకుంటూ వస్తున్నాం.  అలాగే  త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి వధించి తిరిగి ఆ రోజు అయోధ్యలో ప్రవేశించిన శుభదినం. 

దీపావళి పర్వదినం రోజు ఆ జగన్మాత మహాలక్ష్మీదేవిని సర్వోపచారాలతో పూజిస్తారు. దీపావళి పర్వదినం రోజున ప్రత్యేకించి లక్ష్మీదేవిని పూజించడానికి గల కారణాలు ఏంటంటే?

ఈ దీనస్థితి నుంచి గట్టెక్కేందుకు ఇంద్రుడు శ్రీహరిని స్తుతించగా.. ఒక దీపాన్ని వెలిగించి దాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి భక్తి శ్రద్ధలతో పూజించమని చెప్పాడు. ఆ పూజలు ఆచరించిన దేవేంద్రునిపై లక్ష్మీదేవి కరుణాకటాక్షం లభించింది. దీంతో ఇంద్రుడు తిరిగి రాజ్యాన్ని పొందగలిగాడు. ఇంకా దేవలోకాధిపత్యం లభించింది.

అందుకే ..మూడవ రోజున సాయంకాలం ధనలక్ష్మీ పూజను చేసి దీపములను వెలిగించి ఇంటినంతటినీ దీపములతో అలంకరించాలి.ఈ దీపముల వరుసలతో అలంకరించుకుంటాము కనుక ఈ రోజును దీపావళి అంటారు. అలాగే సత్యభామదేవి నరకుని సంహరించిన రోజు నరక చతుర్దశి. ఆ ఆనందపు పండగే దీపావళి అని అందుకే మనం బాణసంచా వెలిగిస్తామని అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇక్కడితో ఆశ్వీయుజంలో చివరి ఈ మూడు రోజుల పండగ వల్ల మన పితరులకు ఉత్తమ లోక ప్రాప్తి, మనకు ధనలక్ష్మీ అనుగ్రహం లభిస్తాయన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: