వసంత కాలంలో వచ్చే పండుగను రంగుల పండుగ, హోలీ. హోలీ పండుగను కాముని పున్నమి, డోలికోత్సవముగా జరుపుకుంటారు. భారతదేశంలోనే కాకుండా నేపాల్, బంగ్లాదేశ్ వంటి తదితర దేశాల్లో ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు. హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మథురా, బందావన్, నందగావ్ మరియు బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు.  శ్రీ బాలకృష్ణుని ఫాల్గుణ మాసం పూర్ణిమ తిధినాడు ఊయలలో (డోలికలో) వేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల బెంగాలు రాష్ట్రంలో ఈ రోజును శ్రీకృష్ణుని ప్రతిమను డోలీకలోవేసి ఊపుచూ డోలికోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. అలాగే దక్షయక్ష సమయందు అగ్నికి ఆహుతి అయిన సతీదేవి హిమవంతుని కూతురుగా జన్మిస్తుంది. ఆమెకు దక్షుడు పార్వతి అను నామధేయము చేస్తారు. సతీదేవి వియోగ దుఃఖముతో పరమేశ్వరుడు నిరంతర తపోదీక్షలో నిమగ్నమై ఉంటాడు. అట్టి స్వామికి భక్తి భావముతో పార్వతి అనునిత్యము పూజించి సపర్యలు చేస్తూ ఉంటుంది. దేవతలు పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణము చేయదలచి మన్మధుని ఆశ్రయిస్తారు.  మన్మధుడు అట్టి దేవకార్యం పరమావధిగాయెంచి అంగీకరిస్తాడు. పార్వతీదేవి పరమేశ్వరునకు సపర్యలు చేయు సమయాన్ని తగు సమయముగా ఎంచుకుని పరమేశ్వరునిపై పూల బాణం వేస్తాడు. దాంతో ఆత్మధ్యానంలో ఉన్న పరమశివుని మనసు కామవికారాలకు గురిచేసి పార్వతీ పరమశ్వరుల కళ్యాణానికి కారణభూతుడవుతాడు మన్మధుడు. అలాకృతకృత్యుడైన మన్మధుని దేవతలు అభినందిస్తారు.  కానీ పరమశివుడు ఆత్మధ్యానంలో ఉన్న తాను కామవికారాలకు ఎలాలోను అయ్యానా అని దివ్యదృష్టితో చూసి కాముకుడైన మన్మధుని మూడవ నేత్రము తెరచి భస్మం చేస్తాడు. అనంతరం రతీదేవి పార్మతీ పరమేశ్వరులను పతిభిక్ష పెట్టమని ప్రార్థించగా, రతీదేవికి మన్మధుడు అశరీరరూపంలో సజీవుడై ఉండునట్లు మాంగల్యభాగ్యాన్ని అనుగ్రహం లభిస్తుంది. ఆ రోజు ఫాల్గుణ పూర్ణిమ కావున దీనిని కాముని పున్నమిగా జరుపుకుంటూ ఉంటారని పురాణాలు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: