డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్ రేప్ కేసు లో అరెస్ట్ అయ్యి జైలు లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కేవలం హిందువు అవ్వడం వల్లనే ఆయనకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటున్నారు ఆయన అనుచరులు.

తాము ఇప్పుడు నెమ్మదిగా ఇస్లాం లోకి మారిపోతే అంతకంటే సంతోషకరమైన విషయం ఉండదు అంటున్నారు వారు. సాధ్వీలపై అత్యాచారం కేసులో గుర్మీత్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. హిందూ సంస్థలు చాలా సులభంగా టార్గెట్ అవుతున్నాయని, గుర్మీత్ హిందువు కావడం వల్లే ఆయన జైలుకు వెళ్లారని డేరా అనుచరులు ఆరోపించారు.

సోషల్ మీడియా లో డేరా యొక్క అధికార ప్రతినిధి సందీప్ మిశ్రా ముఖానికి ఒక మాస్క్ పెట్టుకుని వీడియో విడుదల చేసారు.సిర్సాలో ఈ వీడియోను చిత్రీకరించారు.

అందులో ఆయన మాట్లాడుతూ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ, ఢిల్లీ జామా మసీదు షాహీ ఇమామ్ అహ్మద్ బుఖారీతో డేరా అనుచరులు ‘టచ్’లో ఉన్నట్టు చెప్పారు. " మీరు హిందూస్తాన్ ని అభిమానిస్తూ ఒక హిందూ గా ఉంటె మీ కంట్లో నీళ్ళు మాత్రమే మిగులుతాయి. మన సొంత దేశం లో మనం హిందువుగా ఉండడం నేరం ఐన విషయం. విశ్వాసం మీద దాడి జరిగినా కూడా ఎవ్వరూ స్పందించరు . ఇలాంటి టైం లో మతం మారడం లో తప్పేమీ లేదు " అంటూ ఆ వీడియో వైరల్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: