వర్ష రుతువులో భాద్రపద శుద్ధ చవితినే వినాయక చవితి పర్వదినంగా జరుపుకుంటాం. ఎండా కాలంలో కాసిన వేసవి తాపం తగ్గి, బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో ప్రాణశక్తిని గ్రహించి పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. కలువలు, తామరలు, పుష్పాలు విచ్చి పరిమళాలు వెదజల్లుతాయి. నదులు నీటితో నిండి జీవకళ వృద్ధి చెందుతుంది. బుధుడు అధిపతిగా ఉన్న హస్త నక్షత్రం… వినాయకుడి జన్మనక్షత్రం. బుధ గ్రహానికి ఆకుపచ్చని వర్ణమంటే చాలా ఇష్టం. గణనాధుడికి కూడా గడ్డిజాతి మొక్కలంటే ఇష్టం. అందుకే ఆయనకు గరికతోనూ, వివిధ రకాల పత్రితోనూ పూజిస్తాం.

Image result for గణేషుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు

గణేషుడి పూజకు ఒండ్రుమట్టితో చేసిన ప్రతిమను మాత్రమే ఉపయోగించడంలోనూ విశేషముంది.  ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితినాడు ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు.  పండుగ వచ్చేది వర్ష రుతువులో కాబట్టి ఆ సమయంలో చెరువులు పూడికతో నిండి ఉంటాయి. ప్రతిమల తయారీ కోసం బంకమట్టిని చెరువుల నుంచి తీయడం వల్ల పూడిక తీసినట్లు అవుతుంది. అందులోని నీళ్లు కూడా శుభ్రపడతాయి. అంతేకాదు మట్టిని తీసి, బొమ్మను చేయడం వల్ల దానిలోని ఔషధ గుణాలు శరీరానికి మేలు చేస్తున్నాయి.

Image result for గణేషుడిని ఎందుకు నిమజ్జనం చేస్తారు

ఒండ్రుమట్టిలో నానడం, శరీరానికి పట్టించడం మంచిదని ప్రకృతి వైద్యులు పేర్కొంటారు. ప్రకృతి చికిత్సలో భాగంగా ఒండ్రుమట్టిని వాడటం తెలిసిందే. అయితే పదిరోజుల పాటు పూజలు చేసిన వినాయక విగ్రహాన్ని పదకొండోరోజున జల నిమజ్జనం చేయడం వెనుక ఒక ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది.  నీళ్లు తేటపడతాయి. అదీకాక మట్టిని తాకడం, దానితో బొమ్మను చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికి పడతాయి. ఒండ్రుమట్టిలో నానడం ఒంటికి మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 


 పాంచభౌతికమైన ప్రతి ఒక్క పదార్థం, అంటే పంచభూతాల నుంచి జనించిన ప్రతి ఒక్క సజీవ, నిర్జీవ పదార్థమూ మధ్యలో ఎంత వైభవంగా, ఇంకెంత విలాసంగా గడిపినప్పటికీ అంతిమంగా మట్టిలో కలిసిపోవలసిందే.   అందుకే ప్రకృతి దేవుడైన వినాయకుడి విగ్రహాలను మట్టితోనే చేస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి, నైవేద్యాలు సమర్పించి నీటిలో నిమజ్జనం చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: