పురాణాల్లో తన తండ్రి ఆత్మలింగాన్ని రాక్షస రాజు పాలు కాకుండా రక్షించిన ఘనత బాలవినాయకుడికి దక్కింది.  రాక్షస రాజు అయిన రావాణాసురుడు శివుని గురించి ఘోర  తపస్సు చేసాడు. తన తపస్సుకు మెచ్చి తనముందు ప్రత్యక్షమైన శివుని తనతో తన పురమైన లంకకు రమ్మని అడిగాడు. దానికి శివుడు ప్రతిగా తన ఆత్మలింగాన్ని ఇచ్చాడు. తనకు, తన ఆత్మలింగమునకు అభేదం అని చెప్పారు. ఐతే ఆ లింగమును ఎక్కడ భూమిమీద పెడితే అది అక్కడే ప్రతిష్టితమైనట్లు, దానిని మరలా కదిలించుట అసాధ్యం అని కూడా చెప్పారు. 


మహాశివుడి ఆత్మలింగాన్ని తన కబంధ హస్తాల్లో ఉంచే ప్రయత్నం చేసిన రావణాసురుడికి బుద్ది చెప్పాలని తలంచుతాడు వినాయకుడు.  ఇక రావణాసురుడు ఆనందంగా ఆ ఆత్మలింగమును స్వీకరించి తన లంకాపురమునకు దక్షిణదిశగా ప్రయాణం సాగించాడు.  అల కొంత దూరం  వెళ్ళాక (గోకర్ణం వద్ద) సంధ్యా సమయం అయినది. ఆటను స్వయంగా బ్రాహ్మణుడు కావటం వల్ల ఆటను సంధ్యావందనం చేసి తీరాలి. కనుక ఎవరైనా ఆ ఆత్మలింగాన్ని పట్టుకుంటే ఆటను సంధ్యావందనం చెయ్యొచ్చు అని చూడసాగాడు.


ఇక ఇదే సమయం కోసం ఎదురుచూస్తున్న గణపతి అక్కడకు ఒక బ్రాహ్మణ యువకుని రూపంలో అక్కడకు వచ్చాడు. ఆ బాలకుని చూసిన రావణాసురుడు ఆ ఆత్మలింగమును ఆ బాలకునికి ఇచ్చి దానిని జాగ్రత్తగా పట్టుకోమని చెప్పారు. ఒకవేళ ఆ బాలుడు దానిని పట్టుకోలేకపోతే తనను పిలువమని, ఆ బాలుడు 3సార్లు పిలచేలోపు ఆటను వచ్చి స్వయంగా ఆ లింగమును తీసుకుంటాను అని చెప్పాడు. 


రావణాసురుడు సంధ్యావందనం చేసుకోనుతకోసం కొంచెం దూరంగా వెళ్ళాడు. ఇదే అదను అనుకున్న గణేషుడు తన ఒప్పందం ప్రకారం రావణాసురుడిని మూడు సార్లు పిలుస్తాడు..ఇక రావణాసురుడు వచ్చేలోపు ఆత్మలింగాన్ని అక్కడ ఉంచేశాడు. ఆ తరువాత రావణాసురుడు ప్రతిష్టించబడిన ఆ లింగమును కదిలించే ప్రయత్నం చేసాడు. కాని ఆ ప్రయత్నం విఫలమైనది. చేసేది ఏమిలేక రావణాసురుడు మరలి వెళ్ళిపోయాడు.   ఇలా తన తండ్రి ఆత్మలింగాన్ని కాపాడిన గణేషుడిపై దేవతలు పూల వర్షం కురిపించారు.  ఇదే కథ ఆధారంగా చేసుకొని మహానటులు ఎన్టీఆర్, నాగేశ్వరరావు కాంబినేషన్ లో వచ్చింది ‘భూ కైలాస్’. 

మరింత సమాచారం తెలుసుకోండి: