ఆంజనేయ స్వామికి పూజ‌చేసే రోజుల్లో ముఖ్యంగా మంగ‌ళ‌వారం ఎక్కువ‌గా కొలుస్తారు. అదేవిధంగా శనివారం, మంగళవారం మరియు గురువారం. పురాణకథ ప్రకారం, ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, ఎగురవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే ఏడున్నర యేళ్ళ శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపావాశం చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు.


స్వామికి ప్రీతి పాత్రమైన పువ్వులు, ఆకుల‌తో ఇలా ర‌క‌ర‌కాల వాటితో పూజ‌లు చేస్తుంటారు.
తమలపాకుల దండ:
ఒక కధ ప్రకారం, అశోక వనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట, దగ్గరలో పువ్వులు కనిపించక! అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే అంత ఇష్ట‌మ‌ని మ‌న పురాణాల్లో అంటుంటారు.


మల్లెలు:
గురువారాలు స్వామికి మల్లెలతో పూజ చెయ్యడం చాల శ్రేష్టం. ఇక ఈ మ‌ల్లెపూవులంటే ఇష్ట‌ప‌డ‌ని వారు ఎవ‌రుంటారు. ఎంతో మంచి సువాస‌న క‌లిగి ఉంటాయి.


పారిజాతాలు:
స్వామికి పరిమళభరితమైన పువ్వులంటే చాల ప్రీతి. అందుకే పారిజాతంపూలతో పూజ చేస్తారు.


 తులసి:
తులసి రాములవారికి ప్రీతిపాత్రమైనది, అందుకే హనుమంతునికి కూడా ఇష్టమైనది. రాముల‌వారికేదైతే ఇష్ట‌మో అదే ఈయ‌న కూడా ఇష్ట‌ప‌డ‌తారు.


కలువలు:
కలువ పువ్వులు కూడా శ్రీరాములవారికి ఎంతో ఇష్టమైన పూలు. కేరళలోని ఇరింజలకుడలో భరతునుకి ఒక దేవాలయం వుంది. అందులో అతనికి కలువ పూల మాల వెయ్యడం సాంప్రదాయం. శ్రీరాములవారికి హనుమంతుడు మరియు భరతుని మీద ఉన్నంత వాత్సల్యం ఉండడం చేత, హనుమత్ స్వామికి కూడా కలువ మాల వేస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: